RGV: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో అక్టోబర్ 26వ తారీకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ భేటీ కావడం తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో కాకుండా పార్టీ అధ్యక్షుడిగా ప్రైవేటుగా ఆర్జీవిత జగన్ భేటీ కావడం జరిగింది అంట. అంతకుముందు టికెట్ల వ్యవహారంలో కలిసిన ఆర్జీవి నిన్న.. ప్రత్యేకంగా మధ్యాహ్నం లంచ్ సమయంలో జగన్ తో కలిసి దాదాపు 45 నిమిషాల పాటు లంచ్ చేస్తూ పలు విషయాలు మాట్లాడుకోవడం జరిగిందట. అయితే వీరిద్దరి భేటీ అటు రాజకీయంగా ఇటు సినిమా పరంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి తరుణంలో నేడు ట్విట్టర్ లో రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
“అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుంది .రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం. ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం” , 2nd పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది. వ్యూహం “ చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక, ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు.”…అని ట్వీట్టర్ ఆర్జీవీ తెలియజేశారు.
దీంతో రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఇదే ఆర్జీవి 2019 ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఆ టైంలో టీడీపీ ప్రభుత్వం ఈ సినిమాని అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత “వంగవీటి” ఇంకా పలు సినిమాలు చేశారు. ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాలతో ముడిపడిన కథలు. పరిస్థితి ఇలా ఉంటే నిన్న వైయస్ జగన్ తో భేటీ కావడం ఈరోజు వ్యూహం, శపథం సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించటం అటు ఫిలిం ఇండస్ట్రీలో ఇటు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?