కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న తాను ప్రేమించిన వ్యక్తి గౌతమ్ కిచ్లును వివాహమాడి వీరిద్దరూ ఒకటి అయిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే వీరిద్దరూ కలిసి ఉండటానికి ముంబైలో ఒక నూతన ఇంటిని ప్రత్యేకంగా డిజైన్ చేయించు కొని గృహ ప్రవేశం కూడా చేశారు. కాజల్ తన భర్త ఇంటీరియర్ డిజైనర్ కావడంతో వారు ఉండబోయే ఇంటిని ఎంతో అందంగా డిజైన్ చేసినట్లు కాజల్ చెప్పుకొచ్చారు.
పెళ్లయిన తర్వాత కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ తన భర్త ఎంతో మంచివాడని, ప్రతి ఒక్కరితో ఎంతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ, అందరిని గౌరవిస్తారని ఆమె తెలియజేశారు. గౌతమ్ తన భర్తగా రావడంతో తాను ఎంతో లక్కీ అని ఈ చందమామ ఎంతో మురిసిపోయింది.
కాజల్ అగర్వాల్ పెళ్లి అయిన కొద్ది రోజులకు కర్వా చౌత్ అనే పూజలో పాల్గొన్నారు. ఈ పూజ తన భర్త ఆరోగ్యంగా, బాగుండాలని ఉపవాసం చేస్తూ ఈ పూజలు నిర్వహించారు. ఆ విషయం గురించి తాజాగా కాజల్ అగర్వాల్ అని ప్రశ్నించగా… నేనిలా రోజంతా ఉపవాసం ఉండి పూజ చేయటం ఇదే మొదటిసారని, తెలియజేశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అందరూ నిద్ర లేచి తన అత్త, వదిన తో పాటు ఈ పూజ నిర్వహించామని కాజల్ చెప్పారు. అయితే తనతో పాటు తన భర్త కూడా ఈ పూజలో ఉపవాసం ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.
కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని, అలాగని వృత్తిపర జీవితానికి దూరం కానని కాజల్ చెప్పారు.దీపావళి తర్వాత షూటింగ్ లో పాల్గొనడానికి ముంబై నుంచి కాజల్ అగర్వాల్ హైదరాబాద్ రానున్నారు. అయితే కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి తో కలిసి “ఆచార్య” సినిమాలో నటిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.