ఉదయ్ కిరణ్ బయోపిక్ సిద్ధమవుతోందా? ఒకప్పుడు లేడీస్ అట్రాక్షన్ తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్. తన చిత్రాలతో అమితకాలంలోనే క్రేజ్ సంపాదించుకున్నాడు. జీవితంలో ఒడుదొడుకులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. అతని బయోపిక్ తెరకెక్కించాలని ఓ యంగ్ హీరో సంకల్పించాడు. అతను మరెవరో కాదు సందీప్ కిషన్. ఇప్పుడు ఏఒన్ ఎక్స్ ప్రెస్ చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే రాజ్, డీకే దర్శకత్వంలో ఓ తెలుగుసినిమాలో చేయనున్నారు. ఈ గ్యాప్లోనే ఉదయ్ కథతో బయోపిక్ చేయాలని అనుకుంటున్నారని టాక్. ఓ వైపు ఉదయ్ కథను, మరోవైపు వంగవీటి కథను కూడా పరిశీలించారు. అంతే కాదు అంబటి రాయుడుగా మారి, ఆయన కథతో సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా సందీప్కి వచ్చిందట.
అయితే ఈ మూడు కథల్లోకీ ఉదయ్ కిరణ్ బయోపిక్ అయితే, ప్రజలు బాగా కనెక్ట్ అవుతారని ఫీలయ్యాడట సందీప్. అందుకే అతని కథను ప్రస్తుతం డెవలప్ చేయిస్తున్నారు. తన కు బాగా పరిచయం ఉన్న ఓ కొత్త డైరక్టర్ ఈ కథను చెప్పారట. ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉందనీ, కథ ఎలా వస్తుందో చూసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనీ సందీప్ సన్నిహితులు అంటున్నారు.
ప్రస్తుతం సందీప్ నటిస్తున్న ఎ1 ఎక్స్ ప్రెస్ తెలుగులో రూపొందుతున్న తొలి హాకీ బేస్డ్ చిత్రం.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!