Janvi kapoor : సినిమా ఇండస్ట్రీలో తను ఒక అద్భుతం. ఎన్నో విభిన్న పాత్రలు చేసి ఎంతో మందిని ఆకట్టుకున్న అలనాటి తార, అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటన ద్వారా ఎంతోమంది మంత్రముగ్ధులను చేసిన ఈమెకు ఎలాంటి స్థాయిని తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఎంతో స్టార్ గుర్తింపును సంపాదించుకున్న ఈ అతిలోక సుందరి ఈ లోకాన్ని వదిలి పెట్టడంతో ఎంతోమంది కన్నీరుమున్నీరయ్యారు. సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న శ్రీదేవి చనిపోయి అప్పుడే మూడు సంవత్సరాలు అయ్యిందా అన్నట్టుగా ఉంది.
శ్రీదేవి చనిపోయిన మూడు సంవత్సరాలు కావడంతో శ్రీదేవి భర్త బోనీకపూర్ తన పిల్లలతో కలిసి చెన్నైలోని మైలాపూర్ నివాసంలో ఈరోజు (ఫిబ్రవరి 24) ఆమె జ్ఞాపకార్థం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గత మూడు సంవత్సరాల క్రితం శ్రీదేవి తన మేనల్లుడి వివాహానికి దుబాయ్ వెళ్లారు. ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి శ్రీదేవి మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తన తల్లి మరణానంతరం శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన తల్లి గురించి ఎంతో భావోద్వేగంగా స్పందించారు….
నేను కళ్లు మూసుకున్న ప్రతిసారి:
తన తల్లి మరణించిన తర్వాత కొద్ది రోజులకు జాన్వికపూర్ తన తల్లి గురించి ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ..”నా హృదయంలో మీకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. ఇకపై ఈ లోకంలో నేను జీవించడం కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ సూన్యంలో మీరు నన్ను ముందుకు నడిపిస్తారు. నేను కళ్ళుమూసుకుని ప్రతిసారి మీ మాటలు గుర్తొస్తాయి. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉంటాయి. చాలా స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉన్నారు. మీరు ఈ ప్రపంచం కోసం ఉన్నారు. అందుకే మిమ్మల్ని తిరిగి వెనక్కి తీసుకెళ్లారు”అంటూ తన తల్లి గురించి ఎంతో భావోద్వేగంగా జాన్వి కపూర్ స్పందించారు.తన తల్లి మరణం తర్వాత ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం ‘రూహీ’ చిత్రంతో పాటు ‘గుడ్ లక్ జెర్రీ’, ‘దోస్తానా2’లోనూ నాయికగా నటిస్తోంది.