ఇటీవల టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ అనారోగ్య కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈయన మృతిపై టీమ్ ఇండియా క్రికెట్ ఆటగాడు, సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ యూసఫ్ పఠాన్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా యూసఫ్ పఠాన్ వేణు మాధవ్ మృతికి సంతాపాన్ని తెలియజేశారు. వెండితెరపై తాను చూసిన అద్భుతమైన నటుల్లో వేణుమాధవ్ ఒకరని, ఆయన స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మరి గుజరాత్కు చెందిన యూసఫ్ పఠాన్కు వేణుమాధవ్ ఎలా పరిచయం అనే సందేహాలు కూడా కలిగాయి. అయితే ఇప్పుడు మన తెలుగు చిత్రాలన్నీ హిందీలోకి డబ్ అవుతున్నాయి. ఇలా డబ్ అయిన చిత్రాల్లో వేణుమాధవ్ నటనకు యూసఫ్ పఠాన్ అభిమానిగా మారి ఉంటారని నెటిజన్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.
previous post
next post