RRR OTT: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ ఇందులో హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గణ్, శ్రియా, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలను పోషించారు.
డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య హై బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం.. మే 25న అట్టహాసంగా విడుదలైంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. భారీ విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగుని కలెక్షన్స్ను రాబట్టింది. ఇప్పటికే ఎన్నో రికార్డులను నెలకొల్పిన ఈ సినిమా.. తాజాగా 500 థియేటర్లలో 50 రోజులను కూడా పూర్తిచేసుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే కరోనా వచ్చిన తర్వాత థియేటర్స్లో విడుదలైన సినిమాలన్నీ కొద్ది రోజుల గ్యాప్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న జీ5.. మే 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ విజువల్ వండర్ను థియేటర్స్లో మిస్ అయిన వారంతా ఓటీటీలో చూడాలని సిద్ధమవుతున్నారు. కానీ, వారికి జీ5 ఊహించని షాక్ ఇచ్చింది. అదేంటంటే.. ఆర్ఆర్ఆర్ను ఓటీటీలో చూడాలన్నా డబ్బులు చెల్లించాల్సిందేనట.
జీ5 వారు ఆర్ఆర్ఆర్ను ట్రాన్స్క్షనల్ వీడియో ఆన్ డిమాండ్(టీవీవోడీ) పద్ధతిలో అందుబాటులో తెస్తున్నారు. అంటే సినిమాను చూడాలంటే రూ.200 చెల్లించి అద్దెకు తీసుకోవాలి. లేదా కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే 12 నెలల ప్లాన్ రూ. 599 + ఆర్ఆర్ఆర్ సినిమా చూడాలనుకుంటే రూ.100 అంటే మొత్తం రూ. 699 చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో ట్విట్ కూడా ఉంది. ఆర్ఆర్ఆర్ తో కలిపి సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారికీ మూవీ 7రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిని బట్టీ చూస్తుంటే.. జీ 5 సబ్స్క్రైబర్లుగా ఉన్నవారు సైతం ఆర్ఆర్ఆర్ ను స్ట్రీమింగ్ అయిన వెంటనే వీక్షించాలంటే డబ్బు కట్టాల్సిందే. మొత్తానికి ఊరించి ఉసూరుమనిపించడంతో నెటిజన్లు మరియు అభిమానులు ఇది న్యాయమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.