Big Bash 2022-23: ఇండియాలో ఐపీఎల్ మాదిరిగా ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ టోర్నమెంట్ కి మంచి క్రేజ్ ఉంది. ఆస్ట్రేలియా క్రికెట్ అకాడమీ నిర్వహించే ఈ టోర్నీలో లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించే రీతిలో నిర్వాహకులు వ్యవహరిస్తారు. కానీ ఈసారి బిగ్ బాష్ లీగ్ లో విదేశీ ఆటగాళ్లకు సైతం చోటు కల్పించారు. నేడు మొదటి మ్యాచ్ స్టార్ట్ అయింది. 8 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ సిడ్నీ థండర్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరిగింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కి కామెంట్రీ చేయడానికి వచ్చిన గిల్ క్రిస్ట్ కన్నీరు పెట్టుకున్నాడు. విషయంలోకి వెళ్తే ఈ ఏడాది మార్చి నెలలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మాజీ బౌలర్ షేన్ వార్న్ మరణించడం తెలిసిందే. థాయిలాండ్ లో.. ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇక ఆ తర్వాత రెండు నెలల క్రితం మరో మాజీ ఆటగాడు సైమండ్స్ కూడా కారు ప్రమాదంలో మరణించాడు. ఇద్దరు కూడా ఒకప్పుడు గిల్ క్రిస్ట్ తో కలసి ఆస్ట్రేలియా క్రికెట్ టీంలో స్టార్ ఆటగాలుగా రాణించడం జరిగింది. ఈ క్రమంలో బిగ్ బాష్ లీగ్ తొలి మ్యాచ్ లో… ఆండ్రూ సైమండ్స్, షేన్ వార్న్ కి నివాళులు అర్పించడం జరిగింది. వాళ్లు నేషనల్ ఐకాన్స్… మనకు ఎంతగానో ఇష్టమైన ఆటగాళ్లు. వాళ్లు ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.. అంటూ దుఃఖంతో కామెంట్రీ బాక్స్ లో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇదిలా ఉంటే బిగ్ బాష్ లీగ్ తొలి రెండు సీజన్ లలో షేన్ వార్న్… ఆడటం జరిగింది. ఆండ్రూ సైమండ్స్.. మాత్రం ఈ లీగ్ లో అప్పట్లో కామెంట్రీ చేయడం జరిగింది. ఈ క్రమంలో వారిద్దరిని మొదటి మ్యాచ్ లో కామెంట్రీ చేస్తూ గిల్ క్రిస్ట్ గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకోవడం సంచలనంగా మారింది.
Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!