BCCI: వచ్చే ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. 2011 వ సంవత్సరంలో ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో ధోనీసేన ప్రపంచ విజేతగా నిలిచింది. ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఎక్కడా కూడా ఇండియా గెలవలేదు. సో వచ్చే ఏడాది స్వదేశంలో జరగబోయే వరల్డ్ కప్ టోర్నీ బీసీసీఐ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో జట్టులో కీలక మార్పులు చేయడానికి డిసైడ్ అయినట్లు సమాచారం. దీనిలో భాగంగా ముందుగా కెప్టెన్సీ బాధ్యతలు నుండి రోహిత్ శర్మని తొలగించనుందట.
ఇక ఇదే సమయంలో రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడానికి బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వన్డే నుండి మాత్రమే కాదు టి20 వరల్డ్ కప్ నుండి కూడా రోహిత్ శర్మకి కెప్టెన్సీ నుండి ఉద్వాసన కల్పించి.. హార్దిక్ కి బాధ్యతలు చెప్పడానికి బీసీసీఐ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా ప్రదర్శన చాలామందికి చిరాకు కలిగించింది. ముఖ్యంగా కెప్టెన్ గా రోహిత్ శర్మ.. ఫెయిల్ అవ్వటం మాత్రమే కాదు బ్యాటింగ్ లో..కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఇండియన్ టీం మాజీ ఆటగాల నుండి ఇంకా క్రికెట్ అభిమానుల నుండి కెప్టెన్సీ బాధ్యతలు నుండి.. రోహిత్ ని తొలగించి సీనియర్లను పక్కన పెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది.
కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలని ముఖ్యంగా బౌలింగ్ పరంగా… టీం మరింత పటిష్టంగా ఉండాలని అన్నారు. బ్యాటింగ్ పరంగా టీం బాగున్న గాని బౌలింగ్ లో… జుట్టు చాలా బలహీనంగా ఉందని కామెంట్లు వస్తున్నాయి. ఇక కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మ కొన్ని సమయాలలో ఆటగాళ్లపై మైదానంలోని అసంతృప్తి చెందటం కూడా చాలామందికి చిరాకు కలిగించింది. దీంతో బీసీసీఐ తాజాగా.. కెప్టెన్సీ బాధ్యతలు నుండి రోహిత్ నీ తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!