U19 World Cup: ఐసీసీ నిర్వహించిన మొట్టమొదటి అండర్ 19 మహిళ ప్రపంచ కప్ భారత్ గెలిచి చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ పై గెలిచి ఫైనల్ కి చేరుకున్న భారత్…ఫైనల్ లో ఇంగ్లాండ్ టీంతో తలపడింది. దక్షిణాఫ్రికా పోచెఫ్ స్ట్రూమ్ లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచినా భారత్.. బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. భారత్ బౌలర్ లు ఇంగ్లాండ్ జట్టుని 17.1 ఓవర్ లలో 68 పరుగులకే ఆల్ అవుట్ చేయడం జరిగింది. ఇంగ్లాండ్ టీంలో రైనా మెక్ డోనాల్డ్ గే (19)… అత్యధిక స్కోర్ చేయడం జరిగింది. మిగతా వారిలో కెప్టెన్ గ్రేస్ స్కీవెన్స్ 4, లిబర్టీ హిప్ డక్ ఔట్, నిమా హోలాండ్ 10, సెరెన్ స్మాలే 3, క్రిస్ పావలే 2, అలెక్సా 11, జోసీ గ్రోవ్స్ 4, సోఫీ స్మాలే 11 పరుగులు సాధించారు.
భారత్ బౌలర్ లలో సాధు 2, అర్చనా దేవి 2, పర్శవి చోప్రా 2, మన్నత్ కశ్యప్ 1, కెప్టెన్ షెఫాలీ వర్మ 1, సోనమ్ యాదవ్ 1 వికెట్లు తీయడం జరిగింది. అనంతరం రెండో బ్యాటింగ్ కి దిగిన భారత్ .. 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించారు. ఇండియా మహిళల టీంలో కెప్టెన్ షెఫాలీ వర్మ 15, మరో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ 5 పరుగులు చేశారు. అనంతరం తెలుగమ్మాయి గొంగడి త్రిష 24 పరుగులతో.. నిలకడగా ఆడి వికెట్ పడకుండా.. భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సౌమ్యాతివారి 24 పరుగులతో అజేయంగా నిలిచి ఇండియాను గెలుపు తీరాలకు చేర్చింది. దీంతో ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి అండర్ 19 మహిళల ప్రపంచ కప్ భారత్ వశం అయింది. గతంలో సీనియర్ అమ్మాయిలు 2 వన్డే, T20WC ఫైనల్ కీ వెళ్లినప్పటికీ రన్నర్ రప్ తోనే సరిపెట్టుకోవటం జరిగింది.
కానీ ఈసారి కెప్టెన్ షెఫలివర్మ కెప్టెన్సీలో అండర్ 19 ప్రపంచ కాప్ గెలిచి.. చరిత్ర సృష్టించడం జరిగింది. మహిళల అండర్ 19 ప్రపంచ కప్ భారత్ గెలవటం పట్ల ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో అద్భుతమైన.. ఆట తీరు ప్రదర్శించారు. మీ విజయం భావితరాల వారికి స్ఫూర్తిదాయకం. జట్టు సభ్యులందరికీ శుభాకాంక్షలు అని మోడీ ట్విట్టర్ లో ట్విట్ చేశారు. ఇక ఇదే సమయంలో అండర్ 19 మహిళల జట్టుకు సపోర్టింగ్ స్టాఫ్ కు… బీసీసీఐ కార్యదర్శి జైషా.. ఐదు కోట్ల నజరానా ప్రకటించడం జరిగింది. ఫిబ్రవరి మొదటి తారీఖున అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కీ ప్రపంచ కప్ గెలిచిన భారత్ మహిళల అండర్-19 టీంనీ ఆహ్వానించి సత్కరించనున్నట్లు తెలిపారు. వీళ్లంతా దేశాన్ని గర్వించేలా చేశారని జైషా ఆనందం వ్యక్తం చేశారు.