IND vs NZ: న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ లు చాలా రేగి ఆడగా రెండో మ్యాచ్ లో బౌలర్లు ప్రతాపం చూపించారు. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ న్యూజిలాండ్ నీ 108 పరుగులకే ఆల్ అవుట్ చేయడం జరిగింది. కేవలం 34.3 ఓవర్ లకి కివీస్ బ్యాట్స్ మెన్ లు చేతులెత్తేశారు. ప్రారంభంలోనే ఓపినర్స్ తోపాటు కీలకమైన ఆటగాళ్లు 10.3 ఓవర్ లలో అవుట్ అయిపోవడం జరిగింది. మొదట వన్డే మ్యాచ్ లో ఎంతో బాగా ఆడిన ఆటగాళ్లు కూడా… రాణించలేకపోయారు.
ఇండియా టీంలో షమీ 3, పాండ్య, సుందర్ చెరో రెండు వికెట్లు తీయగా… సీరాజ్, శార్దూల్, కుల్డీప్ చెరో వికెట్ తీయడం జరిగింది. అనంతరం సెకండ్ బ్యాటింగ్ కి దిగిన ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో 20.1 ఓవర్ లలోనే 109 పరుగులు చేసి లక్ష్యాన్ని చేదించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 51.. పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ 11 పరుగులకే అవుట్ అయిపోయాడు. గిల్ 40 పరుగులు చేయడం జరిగింది. సెకండ్ మ్యాచ్ విజయంతో భారత్ సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే జరగబోయే మూడో వన్డే మ్యాచ్ కూడా భారత్ గెలిస్తే మాత్రం ఐసిసి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోనుంది.
భారత్ తో సీరిస్ కి ముందు నెంబర్ వన్ పొజిషన్ లో 115 రేటింగ్ పాయింట్స్ తో న్యూజిలాండ్ ముందంజలో ఉంది. ఈ క్రమంలో సెకండ్ మ్యాచ్ ఇండియా గెలవడంతో.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఇండియా మూడో స్థానానికి ఎగబాకింది. వరుసగా రెండు వన్డేలలో ఓటమి చెందటంతో న్యూజిలాండ్ రెండో స్థానానికి పడిపోయింది. ఈ క్రమంలో మూడో వన్డేలో భారత్ మరోసారి గెలిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానానికి వెళ్లే అవకాశం ఉంది.
Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!