T20 WC 2022: ఆదివారం నాడు నరాలు తెగే ఉత్కంఠ భరితంగా జరిగిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ క్రికెట్ ప్రేమికులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది. మ్యాచ్ చివరి బంతి వరకు విజయం రెండు టీమ్స్ మధ్య దోబూచులాట ఆడటంతో .. ఒత్తిడిలో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. తీవ్ర ఒత్తిడిలో విరాట్ కోహ్లీ ఆడిన ఆట తీరు చాలామంది ఆకట్టుకోవడం జరిగింది. ఓపెనర్స్ తొందరగానే అవుట్ అవ్వడం తర్వాత సూర్య కుమార్ యాదవ్ తక్కువ స్కోర్ కే అవుట్ కావడంతో ఇండియా ఓడిపోవడం గ్యారంటీ అని అందరు భావించారు.
ఇటువంటి సమయంలో విరాట్ మరియు హార్దిక్ పాండ్యా అద్భుతమైన పార్ట్నర్ షిప్ తో ఇండియా గెలవడానికి బాటలు వేశారు. అయితే చివరి ఓవర్ లో నోబాల్ నీ విరాట్ సిక్స్ బాధటం తెలిసిందే. దీంతో ఫ్రీ హిట్ రావడంతో… ఆ బాల్ కి కోహ్లీ బౌల్డ్ కావడం జరిగింది. అదే సమయంలో దినేష్ కార్తీక్ మరియు కోహ్లీ 3 పరుగులు చేశారు. దీంతో బౌల్డ్ ఆయన బంతికి ఎలా రాన్స్ చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద వివాదంగా నెలకొంది. అయితే ఈ వివాదం పై ప్రముఖ ఎంపైర్ టౌఫెల్ స్పందించారు.
అనేక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లకి ఎంపైర్ చేసినా అనుభవం కలిగిన టౌఫెల్ … ఈ వివాదం పై క్లారిటీ ఇచ్చారు. “నన్ను చాలామంది దీని గురించి అడిగారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో నో బాల్ కి ఫ్రీ హిట్టు రావడం బౌల్డ్ కావటం పరుగులు చేయటం అంతా కరెక్టే. అందులో ఎలాంటి తప్పులేదు. అంపైర్ లు సరైన నిర్ణయం తీసుకున్నారు. బాల్ వికెట్లకి తగిలి వెళ్తే అది డేడ్ బాల్ కాదు. రన్స్ నీ బైస్ గా ప్రకటించడం కరెక్టే అని టౌఫెల్ సమాధానం ఇవ్వడం జరిగింది.
Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!