T20 WC 2022: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నయి. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీములు గెలిచేస్తున్నాయి. మొన్ననే పాకిస్తాన్ జట్టుపై జింబాబ్వే గెలవడం తెలిసిందే. ఇక నేడు టోర్నీలో పసికున్నా లాంటి నెదర్లాండ్ టీం… సౌత్ ఆఫ్రికా పై గెలవడం జరిగింది. నెదర్లాండ్ గెలుపుతో గ్రూపు 2లో ఇండియా సెమిస్ కి చేరుకుంది. ఇక ఇదే సమయంలో కొద్ది గంటలకు బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగటం తెలిసిందే.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 127 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో రెండోసారి బ్యాటింగ్ కి దిగిన పాక్ బ్యాట్స్ మెన్ లు 18.1 ఓవర్ లలో 128 లక్ష్యాన్ని ఐదు వికెట్ల తేడాతో సాధించారు. మొదట బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ లపై పాకిస్తాన్ బౌలర్ షాహిన్ అఫ్రిది ముప్పు తిప్పలు పెట్టి నాలుగు వికెట్లు తీసి.. మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇంకా పాకిస్థాన్ విజయంలో మొహమ్మద్ రిజ్వాన్ (32 పరుగులు, 32 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్), మొహమ్మద్ హారిస్ (31 పరుగులు, 18 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్స్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (25 పరుగులు, 33 బంతుల్లో, 2 ఫోర్లు), షాన్ మసూద్ (24 పరుగులు, 14 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక పాత్ర పోషించారు.
దీంతో T20 వరల్డ్ కప్ టోర్నీలో గ్రూప్ 2లో పాకిస్తాన్, భారత్ సెమిస్ కి చేరుకున్నాయి. ఈ పరిణామంతో గ్రూప్ వన్ లో సెమీస్ కి చేరుకున్న న్యూజిలాండ్ తో పాకిస్తాన్, ఇంగ్లాండ్ తో భారత్ తలపడనున్నాయి. సెమిస్ లో భారత్, పాక్ జట్లు గెలిస్తే.. ఫైనల్ లో హోరహోరి పోటీ నెలకొంటది. మరి సెమిస్ లో ఎవరు గెలుస్తారో..? ఎవరు ఇంటికి వెళ్లిపోతారో..? చూడాలి.
Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!