పాకిస్తాన్ లోని పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు చేపట్టిన నేపథ్యంలో అతి పురాతనమైన హిందూ దేవాలయం ఒకటి తవ్వకాల్లోబయటపడింది.వాయువ్య పాకిస్తాన్ లోని స్వాత్ జిల్లా బరీకోట్ ఘుండాయ్ దగ్గర పురావస్తుశాఖ తవ్వకాలు చేపట్టిన నేపథ్యంలో 1300 సంవత్సరాల క్రితం అతి పురాతనమైన ఈ ఆలయాన్ని శ్రీ మహావిష్ణు ఆలయంగా గుర్తించినట్లు పాకిస్తాన్ పురావస్తు శాఖ చీఫ్ ఫజల్ ఖాలిక్ తెలిపారు.
1300 సంవత్సరాల క్రితం హిందూ షాహీ ఈ కాలంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్లు పురావస్తు శాఖ అధికారులు తెలియజేశారు. హిందూ షాహిస్, కాబూల్ సాహిస్ గా పిలువబడే వీరిద్దరూ హిందూ రాజ వంశస్థులు. క్రీస్తు శకం 850_1026 మధ్యకాలంలో ఈ రాజ్య వంశస్తులు ప్రస్తుతం పాకిస్థాన్ లో భాగమై ఉన్న కాబూల్ లోయ, గాంధారాతో పాటు వాయవ్య భారత్ ప్రాంతాన్ని పరి పాలించారని చరిత్రలు చెబుతున్నాయి.
ఈ రాజ్య వంశస్థులు నిర్మించిన ఈ ఆలయం ప్రస్తుతం పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడిందని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో వెయ్యి ఏళ్ళ కిందట పురావస్తు ప్రదేశాలు చాలా ఉన్నప్పటికీ, మొట్టమొదటిసారిగా ఈ ఆలయం బయట పడింది. అయితే ఈ విష్ణు దేవాలయం గాంధార నాగరికతకు చెందినదని ఇటలీ పురావస్తుశాఖ అధికారులు తెలియజేశారు.
అంతేకాకుండా ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో సైనిక స్థావరాలను, కోట బురుజులను, అలాగే ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద కోనేరు కూడా అధికారులు గుర్తించారు. వీటితో పాటు కంటోన్మెంట్, వాచ్ టవర్ జాడలు కూడా గుర్తించినట్లు పురావస్తు శాఖ అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా స్వాట్ జిల్లాలో అనేక బౌద్ధ ఆరామాలు కూడా బయటపడినట్లు తెలియజేశారు.