రామ భక్తుల గురించి ఎన్నో కథలు వినే ఉంటారు . ఇప్పుడు చెప్పేది కూడా అలాంటిదే. నిజానికి ఇంతటి భక్తులు ఉండబట్టే ఆ రామయ్య మందిరానికి ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా భూమి పూజ జరిగింది అని అనిపించక మానదు.
ఇంచుమించుగా 28 ఏళ్లపాటు ఉపవాసం ఉన్న 82 ఏళ్ల వృద్ధురాలు తన ఉపవాసాన్ని విరమించుకోబోతున్నారు. అందుకు కారణం అయోధ్యలోని రామ మందిరానికి సంబంధించిన వివాదం. వివరాల్లోకి వెళితే…
మధ్యప్రదేశ్ కి చెందిన ఊర్మిళాదేవి రామ భక్తురాలు. 1992లో బాబ్రీ మసీద్ కి ఇంకా రామ మందిరానికి మధ్య వివాదాలు అవ్వడంతో మళ్లీ రామ మందిరం తిరిగి గుర్తింపు లోకి వచ్చేంతవరకు ఉపవాస దీక్ష లో ఉంటాను అని ఊర్మిళాదేవి కుటుంబ సభ్యులకు తెలిపారు.
ఊర్మిళాదేవి కుటుంబ సభ్యులు తెలిపిన దాని ప్రకారం,ఊర్మిళ గొప్ప రామ భక్తురాలు అని, 1992లో రామమందిర నిర్మాణానికి సంబంధించిన గొడవ జరిగినప్పుడు ఊర్మిళ కి 54 సంవత్సరాలు ఉంటాయని, గొడవ జరిగినప్పటి నుండి తను అన్నం జోలికి వెళ్లను అని ప్రతిజ్ఞ చేసింది అని, అప్పటినుండి కేవలం పండ్లు తింటూ నే తన జీవితాన్ని కొనసాగిస్తోంది అని, రోజు శ్రీ రామ నామం జపిస్తూ ఉంటుంది అని, ఎప్పుడైతే రామమందిర నిర్మాణానికి మద్దతు ఇస్తూ సుప్రీం కోర్టు తన తీర్పును విడుదల చేసిందో అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని, ఇంకా జడ్జి లని ఊర్మిళాదేవి తన లేఖల ద్వారా అభినందించారు అని , కుటుంబ సభ్యులందరూ మళ్లీ ఊర్మిళాదేవి ఎప్పుడు వాళ్లతో కలిసి మామూలుగా భోజనం చేస్తుంది అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇదంతా మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ లో తెలియ చేసారు.