ఆంజనేయస్వామి..అంటే అందరికీ ప్రీతి. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు అందరికీ ఆయన పేరు చెబితే చాలు అభయమిచ్చే స్వామిగా, భయం తొలగించి శుభాలు కలిగించే స్వామిగా పూజిస్తారు. శైవం, వైష్ణవం ఇలా శాఖల బేధం లేకుండా ఆరాధించే స్వామి హనుమాన్.
ఆయనకు ప్రీతికరమైన వాటిలో సింధూరం ఒకటి. సింధూరం ధరిస్తే మనక కలిగే లాభాలను ఆయా పురాణాలలో చెప్పిన విశేషాలు తెలుసుకుందాం… ఎవరింట్లో అయితే భీతి, భయం వెంటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది.
ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది.
చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, భీతి, రోగ బాధలు ఏమీ దచిచేరవు. ఆరోగ్యవంతులుగా ఉంటారు.
విద్యార్థులు, విధ్యార్థినులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు.. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది.
ఇలా అనేక రకాలుగా సింధూరం వల్ల లాభాలు కలుగుతాయని పెద్దల విశ్వాసం. మీరు ధరించండి స్వామి కృపకు పాత్రులు కండి.