దేవీ నవరాత్రుల సందర్బంగా ఈరోజు అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.అలాగే ఈరోజు మూల నక్షత్రం కావున ఈరోజు చాలా ప్రత్యేకమనదిగా చెప్పవచ్చు. అమ్మవారి ఆలయాలు అన్ని కూడా భక్తులతో కిటకిట లాడుతూ ఉంటాయి. ఈ శుభతరుణంలో అమ్మవారికి ఈరోజు పెరుగన్నం , దద్ధోజనంను ప్రసాదానంగా పెట్టాలి. మరి దద్ధోజనంను ఎలా తయారు చేయాలో తెలుకుందామా..!
కావలసిన పదార్ధాలు :
బియ్యం -1/4 కిలో
పాలు- 1/2 లీ
చిక్కటి పెరుగు- 1/2 లీ
నూనె -1/2 కప్పు
నెయ్యి -1 స్పూన్
కొత్తమిర -కొద్దిగా
కరివేపాకు-రెండు రెమ్మలు
చిన్న అల్లం ముక్క
పచ్చిమిర్చి-2
పోపు సామాగ్రి
జీడిపప్పు- 20
ఉప్పు -తగినంత
ఇంగువ -కొద్దిగా
ఎండుమిర్చి-2
తయారు చేసే విధానం :
ముందు బియ్యం కడిగి అన్నంను వండుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు కాచుకుని కాస్త చల్లారాక అన్నంలో కాచినపాలు , పెరుగు, ఉప్పు ,వేసి బాగా కలపాలి.తరువాత సన్నగా తరిగిన చిల్లి , కొత్తమిర ,కోరిన అల్లం ,అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టి అందులో నునె వేసి పోపుకు కావలసినవన్నీ వేయండి. తరువాత ఎండుమిర్చి,ఇంగువతో పాటు తరిగి వుంచిన పదార్ధాలు అన్ని వేసి బాగా వేగనిచ్చి పెరుగు కలిపిన అన్నంలో పోయాలి. తరువాత కాస్త నేతిలో వేయించిన జీడి పప్పులను కూడా దద్ధోజనంలో వేయండి. అంతే ఎంతో రుచికరమైన దద్ధోజనం రెడీ అయినట్లే.ఈ దద్ధోజనం అంటే చదువుల తల్లికి ఎంతో మక్కువ