భక్తులు నిత్యం ఇంట్లో దీపారాధన తప్పక చేయడం అలవాటు. అయితే ఈ దీపాలను వెలిగిండచంలో పండితులు చెప్పిన విధానం పాటిస్తే శుభఫలితాలు తొందరగా వస్తాయి అనేది వాస్తవం.
దీనికోసం ఆయా దేవుళ్లకు ఏ రకమైన దీపం పెట్టాలి అనే విషయాలను తెలుసుకుందాం..భైరవస్వామికి ఆవనూనె దీపం వెలిగించి పూజిస్తే శత్రుపీడ విరగడ అవుతుంది. సూర్యభగవానుడి ప్రసన్నం కోసం నేతిదీపం వెలిగించాలి. శని ఆరాధనలో ఆవనూనె దీపం వెలిగించాలి. రాహు, కేతు గ్రహ శాంతి కోసం అవిసెనూనెతో దీపారాధన చేయాలి. వ్యాపారస్థులు ఆర్ధిక లాభాల కోసం నియమపూర్వకంగా పూజగదిలో లేదా దేవాలయాలలో స్వచ్చమైన నేతి దీపం వెలిగించాలి. ఏ దేవీదేవతల పూజలో అయినా ఆవునేతి దీపం, నువులనూనె దీపం తప్పకుండా వెలిగించాలి. దుర్గాదేవి, జగదాంబ, సరస్వతీదేవీల కృప కోసం రెండు ముఖాల దీపం వెలిగించాలి.
విఘ్నేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే మూడు వత్తుల దీపం వెలిగించాలి. దీనికి ప్రమాణం దీపం వెలిగించనప్పుడు చెప్పే మంత్రం ‘‘సాజ్యం త్రివర్తి సంయుక్తం’’ అనే మంత్రం. ఏ పనినైనా చిత్తశుద్ధితో చేస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయినడంలో సందేహం లేదు. అయితే అవకాశం ఉన్నవారు పైన చెప్పినట్లు పెట్టండి. లేనివారు ఏ దీపం అయినా పెట్టండి కానీ స్వామి/అమ్మకు చిత్తాన్ని అప్పగించి నమస్కారం చేయండి. తప్పక భగవదనుగ్రహం కలుగుతుంది.