తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను టీటీడీ అర్ధంతరంగా నిలిపివేసింది. తిరుమల, తిరుపతిలో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ నెల 30వరకు టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
ఈ ఆదేశాలు సెప్టెంబర్ 6వ తేదీ నుండి ఇది అమల్లోకి వస్తాయని తెలిపింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్లు ఇవ్వరు. తమిళ ప్రాంతం వారికి పెరటాసి నెల కావడంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆన్ లైన్ లో దర్శన టికెట్లు బుక్ చేసుకుని మాత్రమే తిరుమలకు రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.