ప్రతీ తల్లి తండ్రి లక్ష్యం తమ పిల్లలు వృద్ధిలోకిరావాలని. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలనే తపన. అయితే వీటికి జ్ఞాపకశక్తి చాలా అవసరం. దీన్ని పెంపొందించడానికి పలు రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిలో ఒకటి తెలుసుకుందాం..
విద్యార్ధుల జ్ఞాపకశక్తికి కారక గ్రహం బుధుడు. ఈ బుధ గ్రహానికి బలం చేకూరడానికి- విద్యార్థులు ఎక్కువగా పచ్చని ఆకుకూరలు ఆరగించాలి. గణపతిని దర్శించి పూజించాలి. గోవుకు పచ్చగడ్డి తినిపించాలి.
తులసిదళాలను పటికబెల్లంతో కలిపి నూరి, ఆ రసాన్ని రోజూ సేవిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.మనసుకు చంద్ర గ్రహం కారకం. చంద్రునికి బలం కలిగించడానికి తెల్లని పదార్ధాలు తినాలి,దానం చేయాలి. శివార్చన, శివ స్తోత్ర పఠనం ఉత్తమం. చిటికెన వేలుకు వెండి ఉంగరం ధరించాలి.
విద్యార్థులు పుష్యమీ నక్షత్ర సమయంలో చింతచెట్టు ఆకులను తెచ్చుకొని, తాము చదువుకొనే పుస్తకంలో ఉంచుకోవాలి. చదువులో వెనకబడుతున్న పిల్లలు గురువు ఆశీస్సులు పొందాలి. ఆవుకు బెల్లం, శనగపప్పుతినిపించాలి. ఇష్టదైవాన్ని ప్రార్దించాలి.
అయితే ఇవన్నీ పెద్దలు ఆయా సందర్భాలలో ఆచరించి సత్పలితాలు పొందనవి. వారి వారి నమ్మకాలతో కూడినవి అయితే ఎటువంటి ఖర్చులేకుండా సులభంగా చేసుకునేవే ఇక్కడ ప్రస్తావించాం. మీరు నమ్మకంతో విశ్వాసం ఉంటే ఆచరించి లబ్ది పొందండి. భక్తి, శ్రద్ధలతో నమ్మకం, విశ్వాసంతో ఏదైనా సాధించవచ్చు.