శ్రీశైలం.. ద్వాదశ జ్యోతిర్లింగా క్షేత్రాలలో రెండది. దట్టమైన నల్లమల అడువల మద్యలో నుంచి వెళ్తే మనకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం వస్తుంది.
శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండు ఉన్న పరమపవిత్ర క్షేత్రం ఇదిజ. అయితే ఇక్కడ శివపార్వతులను మల్లికార్జున, భ్రమరాంబలుగా ఆరాధిస్తారు. అయితే ఈస్వామి దర్శనానికి వస్తే తప్పక ముందు స్వామి పుత్రుడు గణపతిని దర్శించుకోవాలి. ఆయన సాక్ష్యం తప్పనిసరి. అందుకే ఇక్కడికి దగ్గరలో వెలసిన గణపతిని సాక్షి గణపతిగా ఆరాధిస్తారు. ఆ విశేషాలు తెలుసుకుందాం..
స్థల పురాణం
పూర్వం శిలదుడనే మహర్షి సంతానం కోసం పరమేశ్వరుని గురుంచి తపస్సు చేసాడు . శివుడు ప్రత్యక్షమై కోరుకోమనగా నీకు భక్తులు అయి ఉండే ఇద్దరు పుత్రులను ప్రసాదించమని కోరాడు . ఈశ్వరుని కృప వలన ఇద్దరు కుమారులు జన్మించారు. వారి పేర్లు నంది , పర్వతుడు. వారు పరమేశ్వరుని కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ముందుగ నంది వరం కోరుతూ, నువ్వు ఎల్లప్పుడు నా పై నివసించి ఉండాలి, నిన్ను నేను మోసే భాగ్యాన్ని ప్రసదించమించమని కోరాడు అతని కోరికగా శ్రీశైలానికి 200 కి మీ దూరం లో మహానంది రూపాన్ని పొందాడు .
ఆనాటి నుంచి శివుని వాహనముగా మారాడు . తరువాత పర్వతుడు వరం కోరుతూ నేను దాల్చి, నీవు న పై వెలసి,నా పర్వత శికరాన్ని చుసిన మేరకు ఈశ్వరుడు జ్యోతిర్లింగా రూపంలో వెలిసాడు . పర్వతుడు శ్రీ పర్వతుడుగా అయ్యాడు. కాలక్రమంలో శ్రీశైలంగా పిలువబడుతున్నది.భక్తులు శ్రీశైలం వచ్చి వెళ్ళినట్లుగా సాక్ష్యం చెప్పే సాక్షి గణపతి దేవాలయం ఇక్కడ ఉన్నది .
ఇక్కడ స్వామి చేతిలో గంటం పట్టుకుని రాస్తున్నట్లు ఉంటుంది. ఈ స్వామి దేవాలయం ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చేశారు. నిత్యం గణపతి హోమాలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు, విశేష ఉత్సవాలు, గణపతి నవరాత్రులతో ఈ దేవాలయం భక్తులపాలిట కొంగుబంగారంగా అలరారుతున్నది.