బ్రహ్మ.. త్రిమూర్తులలో సృష్టికారుడు. త్రిమూర్తులలో శివుడు, విష్ణువుకు అనేక దేవాలయాలు. అయితే బ్రహ్మకు మాత్రం దేవాలయాలు లేకుండా ఒక శాపం ఉందని పురాణాలు పేర్కొన్నాయి. అయితే దేశంలో అక్కడక్కడ బ్రహ్మదేవాలయాలు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైన దేవాలయం గురించి తెలుసుకుందాం…
రాజస్థాన్ రాష్ట్రం లోని అజ్మీరు జిల్లాలోని ఒక ఊరు పుష్కర్. అది అజ్మీరు జిల్లాకు వాయవ్యంలో 14 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 510 అడుగుల ఎత్తుగా ఉపస్థితమై ఉంది. ఉత్తర భారతదేశంలో ఉన్న ఐదు పవిత్రధామములలో ఇది ఒకటి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగర నిర్మాణము ఎప్పడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు. అయినా పురాణ కథనాలను అనుసరించి ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల కాలం విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞముచేసాడని ప్రతీతి.
పుష్కర్లో అనేక ఆలయాలు ఉన్నాయి. వీటిలో అనేకం పురాతనమైనవి కాదు. ముస్లిమ్ దండయాత్రలలో అనేకం ధ్వంసం చేయబడ్డాయి. ధ్వంసం చేయబడిన ఆలయాలు పునరుద్ధరించబడ్డాయి. తరువాతి కాలంలో ధ్వంసం చేయబడిన ఆలయాలు పునర్నిర్మించబడ్డాయి. బ్రహ్మాలయానికి చెందిన అనేక దేవాలయాలు క్రీశ 14వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి. ప్రపంచంలో అతి కొన్ని బ్రహ్మదేవుని ఆలయాలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. మిగిలిన బ్రహ్మదేవుని ఆలయాలు ఉత్తరప్రదేశ్ లోని బిదూరులో ఒకటి, భారతదేశంలో రాజస్థాన్ లోని బర్మర్ జిల్లా సమీపంలోని బలోత్రా అనే పల్లెటూరులో ఒకటి, మదర్ టెంపుల్ ఆఫ్ బిసాకిహ్ ఒకటి, ఇండోనేషియా లోని యోగ్యకర్త లోని ప్రంబనన్ ఒకటి.
క్షేత్రపురాణం రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్కు పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న ఒక సరస్సు. ఆ సరస్సు పేరైన పుష్కర్ క్రమంగా ఆప్రాంత మంతటికి స్థిరపడిదింది. ఇక్కడే బ్రహ్మదేవునికి ఒక ఆలయం ఉంది. ప్రపంచంలో మొత్తంలో బ్రహ్మ దేవునికి వున్న ఆలయం ఇదొక్కటే. దేశంలో ఉన్నతీర్థాలలో అతి పవిత్రమైనది ఈ పుష్కర్ తీర్థమే. అందుకే దీన్ని తీర్థ రాజమంటారు. దీన్ని దర్శించక పోతే తీర్థ క్షేత్రాల యాత్ర పూర్తి కానట్టే నని భావిస్తారు హిందూ మతస్తులు. ఈ స్థల పురాణంలో ఒక ఆసక్తి కరమైన కథ కలదు పద్మ పురాణంలో చెప్పబడిన కథను అనుసరించి పూర్వం వజ్రనాభ.