Shivarathri: జగమంతా శివనామ స్మరణలో మునిగిపోయే రోజు శివరాత్రి.. ఈ పుణ్య దినం 2023లో ఫిబ్రవరి 18 శనివారం రోజున వచ్చింది. శివుని భక్తులంతా ఉదయం అంటే స్నానాలు ఆచరించి శివుని ఆలయాలకు వెళ్లి మొక్కలు తీర్చుకుంటా.రు మహాశివరాత్రి రోజున ఏడు లోకాల్లోని పుణ్యక్షేత్రాలు మారేడు దళంలో నిక్షిప్తమై శివుడికి అర్చన చేయబడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.. అందుకే శివరాత్రి రోజున ఉపవాసం చేసి కనీసం ఒక్క మారేడు దళంతో అయినా శివుడికి పూజ చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.. అలాగే ఈరోజు వేటితో పూజించకూడదు.!? పూజలో ఎలాంటి తప్పులు చేయకుండా శివుడికి ఆగ్రహం తెప్పించకుండా ఉండాలో తెలుసుకుందాం..
వీటితో అస్సలు పూజించకండి..!
శివరాత్రి రోజున శివునికి పూజించకుండా ఉండవలసిన వస్తువులలో తులసి కూడా ఒకటి. తులసిని పవిత్రంగా భావిస్తాము. కానీ శివుడికి తులసి ఆకులతో పూజ చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.
సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా కొబ్బరికాయలు కొట్టి దేవుడికి దండం పెడతాం కానీ.. కొబ్బరి నీళ్లను ఎప్పుడూ శివుడికి సమర్పించకూడదు.
కుంకుమ శివరాత్రి ఒక్కరోజే కాదు . ఏ రోజు అయినా శివునికి కుంకం సమర్పించకూడదట. కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఎరుపు రంగు ఉద్దీపనకు కారణంగా పరిగణిస్తున్నారు. పరమేశ్వరునికి విభూది అంటే మహా ఇష్టం. విభూదిని సమర్పించవచ్చు.
పురాణాల ప్రకారం తెల్లని పూలు అంటే శివుడికి ఇష్టం ఉండదట. ఒకవేళ పెట్టాల్సి వస్తే మల్లెపూలను మాత్రమే శివుని దగ్గర పెట్టాలని చెబుతున్నారు. మిగతా ఏ తెలుపు రంగు పువ్వులను పూజించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివుడికి ఉపయోగించే పూజలో శంఖాన్ని వినియోగించకూడదట. పురాణాలతో శంఖ చుర్ణుడు అనే రాక్షసుడు హతమార్చాడని .. అప్పటినుంచి శంఖం అసురుని చిహ్నంగా భావిస్తారు.
శివలింగం చుట్టూ ప్రదక్షిణలు అసలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. సగం వరకే తిరిగి మళ్లీ వెనక్కి వెళ్లిపోవాలని సారాంశం. ఒకవేళ తెలియక తిరిగిన పూజ ఫలం దక్కదని పురాణాలు చెబుతున్నాయి.
శివారాధనకు ఉపయోగించే పాత్రలు రాగివైతేనే చాలా శ్రేష్టం. రాగి పాత్రలలో మాత్రమే శివాభిషేకం చేయాలి. మరే లోహపు పాత్రను ఉపయోగించకూడదు.
శివుడికి పాలు నైవేద్యంగా పెట్టకూడదు. శివ పూజలో పాలు నైవేద్యం పెట్టకూడదని ఎట్టి పరిస్థితులను మర్చిపోవద్దు.
శివరాత్రి రోజున ఉపయోగించే ఎలాంటి నైవేద్యమైన దేవుడికి సమర్పించిన తర్వాత తప్పకుండా అందరికీ పంచాలి.
శివరాత్రి రోజున పూజకు ఉపక్రమించే ముందు మీరు ఎటువైపు తిరిగి కూర్చుంటున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. తప్పకుండా మీరు ఉత్తరాభిముఖం లేదా తూర్పు అభిముఖంగా కూర్చుని పూజ చేయాలి.
శివరాత్రి రోజున శివుడికి సమర్పించే బిల్వపత్రాలు, శమీ పత్రాల తొడిమె మొదటి భాగాన్ని తీసివేయాలి. ఆ తరువాత శివలింగం మీద ఉంచాలి. తొడిమలతో కూడిన పత్రాలను శివుడికి సమర్పించకూడదు.
గోగుపూల సేవ శివుడికి ప్రీతిపాత్రం. కనుక వీలైతే గోగుపులతో ఈ రోజున శివ పూజ చేసుకోవడం మంచిది.
శివరాత్రి రోజు చేసే అభిషేకానికి అవసరమైన వస్తువులన్నింటినీ ముందుగానే సేకరించి అందుబాటులో పెట్టుకున్న తర్వాత పూజకు ఉపక్రమించాలి. పూజ మధ్యలో లేవకూడదు.
శివరాత్రి రోజున శివలింగం దగ్గర నేతి దీపం వెలిగించడం శుభప్రదం.
శివరాత్రి రోజంతా ఉపవాసం చేస్తారు.అంతే కాదు రాత్రి జాగారం కూడా చేస్తారు. ఈ రాత్రి నడుము వాల్చకూడదని పురాణాలు చెబుతున్నాయి.