ఆశ్వీయుజమాసం, శరత్రుతువులో అమ్మవారికి నిర్వహించే శరన్నవరాత్రులు అక్టోబర్ 17న ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలలో విశేషంగా నవరాత్రుల మొదటి రోజు పూజలు జరిగాయి. అక్టోబర్ 17 నుంచి 25 వరకు విశేషంగా నవవార్చనలు నిర్వహిస్తారు. అక్టోబర్ 25న విజయ దశమి. నవరాత్రుల్లో దుర్గాదేవిని 9 రూపాల్లో కొలుస్తారు. ఆ రూపాలు…
మొదటి రోజు శైలపుత్రి, రెండోరోజు బ్రహ్మచారిని, ఇక వరుసగా .. చంద్రఘంట, కుష్మాండ, స్కంద మాతా, కాటాయని, కాళరాత్రి, మహా గౌరి, సిద్ధి దత్రి అనే తొమ్మిది రూపాల్లో దుర్గామాతాను కొలుస్తారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజకు విశేషంగా చేస్తారు.