Uppu Jadi: ఈరోజుల్లో డబ్బు అవసరం లేని వారు ఎవరు ఉన్నారు.. ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం. ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ధనాభివృద్ధి కోసం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అనేక పూజలు చేస్తూ ఉంటారు. అనేక పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొందరి దగ్గర డబ్బు నిలవదు. వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చైపోతుంది.. అలాంటివారు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే..
ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇందుకోసం మనం ముందుగా ఒక మట్టి జాడిని తీసుకోవాలి. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తరువాత ఒక రాగి ప్లేట్ లేదా ఇతడి ప్లేట్ తీసుకోవాలి. తర్వాత ఈ ప్లేట్లో కొత్త పసుపు వస్త్రాన్ని ఉంచాలి. తరువాత ఈ వస్త్రానపై 9 వక్కలను, ఒక పసుపు కొమ్మును ,వెండి లేదా బంగారంతో చేసిన ఉంగరాన్ని లేదా నాణాన్ని ఉంచి మూట కట్టాలి. తరువాత ఈ మూటను మట్టి జాడీలో అడుగు బాగానే ఉంచి. దానిపైన రాళ్ల ఉప్పును పోయాలి. ఈ విధంగా మట్టి జాడీలో పోసిన రాళ్ల ఉప్పును వంటల్లో సాధారణ ఒప్పుకు బదులుగా దీనిని ఉపయోగించాలి .
ఈ విధంగా మట్టి జాడీలో వేసిన రాళ్ల ఉప్పును వాడిన వారం నుండి రెండు వారాల వ్యవధిలోనే మంచి ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే వెండి , బంగారు నాణాలు, ఉంగరాలు అందుబాటులో లేనివారు కనీసం ఒక చిన్న ముక్క బంగారం అయినా అందులో వేయాలి. చిట్కా పాటిస్తే అద్భుతమైన ప్రయోజనాలు అని పండితులు సలహా ఇస్తున్నారు.