తిరుమల భూలోక వైకుంఠం. స్వామి వారు ఇక్కడ అర్చితామూర్తిగా వెలసిల్లాడు.
కలియుగంలో ఆయన భక్తులను కాపాడటానికి స్వామి తిరుమల ఆనందనిలయంలో ఉన్నారు. ఆయనకు నిత్యం అనేక పూజలు చేస్తారు. వాటిలో ప్రధానమైనవాటిలో కొకటి సహస్రార్చన ఒకటి.వారంలో మూడు రోజులు మంగళవారం, బుధవారం, గురువారం స్వామి వారికి తెల్లవారుజామున 4.30 గంటలకు అర్చన జరుగుతుంది. దీన్నే సహస్ర నామార్చన అని కూడా అంటారు. తిరుమలలో స్వామి వారికి మాత్రమే జరిగే సహస్ర నామార్చన గురించి 1518కి ముందునాటి శాసనాల్లోనూ ఉంది.