తొలి ఏకాదశి.. అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకు వచ్చే విషయం ఉపవాసం. అయితే ఉపవాసం ఎలా చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం… ఏకాదశి రోజును శ్రేష్టంగా పరిగణించి అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వారికి ఇటు దైవీకంగా పుణ్యఫలం దక్కుతుంది. సైన్స్ పరంగా చూస్తే మంచి ఆరోగ్య సూత్రం. ఇటివలే జపాన్కు చెందిన సైంటిస్టు కూడ నిర్ధారించి చెప్పారు.
ఏకాదశి ఉపవాసం ఆరోగ్యాన్ని కాపాడి రోగాలు రాకుండా కాపాడుతూ, శారీరక పుష్టిని ఇస్తుంది. ఏకాదశి ఉపవాసం ఏలా చేయాలి అంటే దశమి రోజు రాత్రి వండిన వంటకాలను ఏమి తినకుండా పండ్లు, జ్యూస్ లాంటివి తీసుకోవాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి. ద్వాదశి నాడు ఉదయన అన్నం వండి దేవునికి నివేదన చేయాలి. అనంతరం భోజనం చేయాలి. దీన్ని పారణం అని కూడా పిలుస్తారు. ఇలా ఉపవాసం చేసే శారీరకశక్తి లేని వారు అంటే పిల్లలు,గర్భిణులు,వృద్ధులు,ఆనారోగ్యంతో ఉన్నవారు ప్రతీ రెండు గంటలకు ఒక సారి ఏదో ఒక పండ్ల రసం తీసుకుంటు ఉపవాసం చేయాలి.
ఎవరు వ్రతం చేయకూడదు ?
అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు, 8 ఏండ్ల లోపు పిల్లలు, కార్మికులు, కర్షకులు, అంటే కాయకష్టం చేసేవారు, ఉద్యోగరీత్యా ఉద్యోగాలకు వెళ్లాల్సినవారు, పెద్దవారు అంటే 60 ఏండ్లకు పైబడి షుగర్, బీపీ తదితర వ్యాధులు ఉన్నవారు ఈ వ్రతం ఆచరించకూడదు. వారు దైవనామస్మరణతో ఫలం పొందవచ్చు.