సువాసినీలు భగవంతునికి తల నీలాలు ఈయరాదు. ఏదైనా దాటరాని ఆపద వస్తే దేవునికి మాట ఇస్తే ఐదు కత్తెరలు మాత్రమే ఇవ్వవలెను.
భరించరాని, తట్టుకోలేని ఆపదలు వచ్చినప్పుడు అంతకన్నా వేరే గత్యంతరం లేనపుడు మాత్రమే భర్త అనుమతి తీసుకుని స్వామికి క్షమాపణలు చెప్పి తలనీలాలు సమర్పించాలి. వివాహం కాని కన్యలు రోగగ్రస్తులు అయితే మాత్రమే సమర్పించాలి. తిరుమల శ్రీనివాసుని వద్ద ఈ నియమం వర్తించదు. స్నానం దానం, ధ్యానం, జపం, పూజనం, అర్పణంతో అందరికీ అన్ని సమస్యలు తీరుతాయి. పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు దర్శించినపుడు, క్షవరం, శ్రాద్ధం చేయాలి.
పిండప్రదానం చేయాలి అనే నియమం పురుషులకే కానీ స్త్రీలకు వర్తించదు కావున స్త్రీలు తలనీలాలు అర్పించుట శాస్త్ర సమ్మతం కాదు. దీనిపై ఆయా పండితులు ఆయా సందర్భాలలో చెప్పిన విషయాలను చెప్పాం. ఎవరికి ఇష్టం ఉన్నట్లు వారు, వారి వారి ప్రాంతీయ, కుల ఆచారాలను, మొక్కలను బట్టి తలనీలాలను సమర్పించుకోవచ్చు. దీనిపై అనుమానాలు, ఆభ్యంతరాలు ఏవీ లేవు.