వివాహం.. జీవితంలో ప్రధానఘట్టాలలో ఇది ఒకటి. ముఖ్యంగా భారతీయ సంప్రదాయంలో స్త్రీ స్థానం ప్రధానమైంది. పవిత్రమైంది. అయితే పలు కారణాల వల్ల అమ్మాయిలకు వివాహం ఆలస్యం అవుతుంది.
మంచి సంబంధాలు రాకపోవడం .. మంచి సంబంధం అనుకున్నది తప్పిపోవడం .. అంతా మాట్లాడుకున్నాక చివరి నిమిషంలో ఏదో ఒక కారణంగా సంబంధాలు చెడిపోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి పండితుల చెప్పిన ఒక పరిహారం తెలుసుకుందాం..
వివాహం విషయంలో ఆలస్యమవుతున్న యువతులు, తెల్లవారు జామునే నిద్రలేవాలి. గడపను ముందుగా పాలతోను .. ఆ తరువాత నీళ్లతోను తుడవాలి. ద్వారానికి మామిడితోరణాలు కట్టి, గడపకు పసుపు కుంకుమలు పెట్టాలి. ఆ తరువాత రెండు దీపాలు వెలిగించి, గుమ్మానికి రెండు వైపులా ఉంచాలి. లక్ష్మీనారాయణుల అష్టోత్తరాన్ని అంకితభావంతో చదివి గడపకు హారతి ఇవ్వాలి. ఈ విధంగా 16 రోజుల పాటు చేయడం వలన, వివాహం విషయంలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయనేది పెద్దల మాట. ఇలా ద్వారలక్ష్మీ పూజ చేయడం వల్ల గ్రహబాధలు, ఇతర దోషాలు పోతాయి.