Marriage : పురాణాలు:
భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ గొడవలు జరుగుతుంటే దాంపత్య దోషాలు కారణం కావచ్చు.
ఈ దోషాలు పోవడానికి మహిమాన్వితమైన కాత్యాయని మంత్రాన్ని పఠించాలని పురాణాలు తెలియచేస్తున్నాయి.
వివాహం కానీ ఆడపిల్లలు ,వివాహం తర్వాత
Marriage : గురు గ్రహం కి ఆధిపత్య దైవం:
అన్యోన్యత లేని వారు కాత్యాయని మంత్రాన్ని 45 రోజుల పాటు నిష్ఠతో పఠిస్తే సకల సౌభాగ్యాలు కలగడం తో పాటు దాంపత్యం కూడా బాగుంటుంది.
పెళ్లి విషయంలో వస్తున్నా అడ్డంకులను తొలగించేందుకు కాత్యాయని మంత్ర పఠనం చేయడం ఉత్తమం అని భాగవతం తెలియచేస్తుంది.
కాత్యాయని దేవి భక్తి శ్రద్ధలతో నిష్ఠ గా పూజించడం వలన శివుని భర్తగా పొందగలిగింది. కాబట్టి ఆ అమ్మవారిని పూజించిన వారికి మాంగల్య దోషాలు తొలగిపోతాయి. నవదుర్గల్లో కాత్యాయని అమ్మవారిది ఆరో స్థానం. ఈమె గురు గ్రహం కి ఆధిపత్య దైవం గా చెప్పబడింది. ఆమె సింహంపై ఆసీనురాలై కనిపిస్తుంది. త్రినేత్రాలతో వుంటుంది. కాత్యాయని మంత్ర జపం చేసుకోవడం వలన కుజ దోషాలు సైతం పోతాయి.
దాంపత్య జీవనంలో వుండే దోషాలను కూడా ఈ మాత్రం పోగొడుతుంది. కాత్యాయని మంత్రాన్ని జపించే దంపతులు అన్యోన్యంగా గా ఉంటారు.
సంతానం లేని దంపతులు కాత్యాయని మంత్ర జపం చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది. ఆ మంత్రం గురించి తెలుసుకుందాం.
భార్యాభర్తల మధ్య విడాకులు అనే మాట:
”కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్ యతీశ్వరి
నంద గోప సుతం దేవీ పతిమే కురుతే నమః
అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః
కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కందర
విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబికే దేవీ నారాయణే నమోస్తుతే”
అంటూ 41 రోజుల పాటు అమ్మవారిని ఈ మంత్రంతో జపిస్తే దాంపత్య దోష నివారణ జరిగి
భార్యాభర్తల మధ్య విడాకులు అనే మాట కు అవకాశమే ఉండదు. అసలు ఆలుమగల మధ్య వివాదాలు అనేవి ఉండవని ఆధ్యాత్మిక నిపుణులు తెలియచేస్తున్నారు.