Childrens 01. అర్ధం పర్ధం లేకుండా ఎక్కువగా మాట్లడుతుందేవారికి కొబ్బరి నూనె తీసుకుని అందులో లో ఒక చిటికె మృత్తికాను వేసి తలకు పట్టించి తల దువ్వుకొంటె ఎక్కువ మాట్లాడకుండాఉండడం జరిగి సమాజంలో మంచి వ్యక్తిగా పేరు వస్తుంది.
02. పిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఎక్కువుగా పళ్ళను కొరకడం, కింద పడి తన్నుకోవడం , ఒకే వైపు కు అదేపనిగా చూస్తూ ఉండడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం,రోజు రోజుకు చిక్కి పోతూ ఉండడం, వంటివి జరుగుతూ ఉంటె కాస్త మృత్తికాను తీసుకొని శ్రీ సుబ్రమణ్య స్వామిని మనః స్ఫూర్తిగా ధ్యానించి పిల్లల నుదిటికి బొట్టుగా పెడితే పిల్లలు ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.
03. స్త్రీ లకి ఋతు సమయంలో కడుపు నొప్పి ఎక్కువుగా వస్తుంటే వారు ఋతు సమయనికి ముందు ఒక చిటిక మృత్తికాను తీసుకుని మెత్తని పొడిగా చేసుకుని , కొబ్బరి నూనే లో కానీ అముదంలో కానీ వేసి పొట్టకు రాసుకుంటే ఋతుకాలంలో వచ్చే పొట్టనొప్పి రాదు.
04. పరీక్షా కాలంలో చదివిందంతా మరచిపోతుంటే అలాంటి వారు ఒక చిటికడు మృత్తికాను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని వడకట్టి తాగడం వలన మంచి జ్ఞాపక శక్తీ పెరిగి పరీక్షలో ఉత్తమ శ్రేణిలో పాసవుతారు.
05. సంతానభాగ్యం లేనివారు మంగళవారం రోజు శ్రీ సుబ్రమణ్య స్వామి పూజ చేసుకుని ప్రసాదంగా పాలను పెట్టి ఆ పాలలో ఒక చిటిక మృత్తికాను వేసి దేవునికి చూపించి ప్రార్ధించి ఆ పాలు త్రాగితే స్వామి అనుగ్రహంతో తప్పని సరిగా సంతాన భాగ్యం పొందగలుగుతారు.
6. ఎవరికీ చర్మం పొడి బారిపోతుంటుందో, నాగఫణి రోగం తో బాధ పడుతుంటారో ఎవరైతే బాగా నీరసంతో ఉంటారో అలాంటి వారు చిటిక మృత్తికాను నీటిలో వేసి సాయంత్రం పూత స్నానం చేసేవారికి ఎటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడం తో పాటు భాగ్యవంతులుగా కూడా జీవిస్తారు.