Jeevach: దారుణంగా దేవుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పటికీ కొన్ని ప్రదేశాలలో మాత్రం కొన్ని రూపాలలో విశేషించి ఆయన అనుగ్రహం ప్రజలపై వుంటుంది.. వీటినే ఆలయాలు అంటారు. ఇట్లాంటివి ఎన్నో దివ్యమైన ఆలయాలు మన దేశంలో ఉన్నాయి. ఇకపోతే చాలామంది దంపతులకు..తల్లిదండ్రులు అవ్వడం అనేది ఒక కల. కానీ కొంతమందికి అది అంత త్వరగా నెరవేరదు.. ఇక మీరు కూడా పిల్లలు పుట్టడం లేదని బాధపడుతున్నట్లయితే బీహార్ లోని పూర్ణియా జిల్లాలో జలల్ ఘర్ లో ఉన్న మంజీ వాచ్ ఆలయాన్ని సందర్శించాల్సిందే.
ఈ ఆలయానికి సంబంధించి పౌరాణిక విశ్వాసాలు ఎన్నో ఉన్నాయి. ఆలయ చరిత్ర సంతాన ప్రాప్తి పుటలను పరిశీలించినట్లయితే చరిత్ర చాలానే పెద్దది. ఇకపోతే ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చెరువు ఉంది. అందులో ఏ దంపతులైతే స్నానం చేస్తారో వారికి సంతానం తప్పకుండా కలుగుతుందని ప్రతిదీ.. ఇకపోతే అక్కడ పూజారుల మాటల ప్రకారం చూస్తే నీటి కుంటలో స్నానం చేసేటప్పుడు భర్త లేదా భార్య చేతిలో ఏదో ఒకటి కనిపిస్తుంది. దీన్ని తమతో తీసుకెళ్లి నిజమైన భక్తితో ఆలయానికి వెళ్లి మాంజీ వాచ్ ను ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని ఆయన వెల్లడించారు.
ఇకపోతే ఈ ఆలయాన్ని ఎప్పుడు స్థాపించారు అన్నదానిపై ఎలాంటి సమాచారం లేదు. ఆలయానికి చెందిన పురాణ గాధ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారుతుంది. అక్కడ మౌరన్ అనే ఒక వృద్ధురాలు ఉండేదని.. ఆమె తో పాటు తన భర్తకు కూడా కుష్టు వ్యాధి వచ్చిందట. దీంతో కుటుంబ సభ్యులు వాళ్లను ఇంటి నుంచి గెంటేసారట .ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ ఇక్కడికి వచ్చి చెరువులో స్నానం చేసిన తర్వాత సంతానం కలిగిందట. అప్పటినుంచి ఈ ప్రదేశాన్ని జీవాచ్ మాతా మందిర్ అని పిలుస్తారు. ఇక్కడికి ఒక్క భారత్ నుంచే కాదు నేపాల్ ,చైనా, భూటాన్ తదితర దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారని సమాచారం.