Lakshmi: ప్రస్తుత సమాజంలో చాలా మంది వాస్తు నియమాలను ఫాలో అవుతూ ఉంటారు. ఏ పని మొదలు పెట్టాలన్నా సరే వాస్తు ప్రకారమే మొదలు పెడతారు. ఇక ఇంటి నిర్మాణం నుంచి ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారమే జరుగుతాయి. అంతేకాకుండా చాలామంది ప్రజలు వాస్తు పండితుల సలహాలను తీసుకుని.. వారు చెప్పిన మాటలను తూచా తప్పకుండా చేస్తూ ఉంటారు.
మన ఇంట్లో ఏదైనా వాస్తు తప్పితే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు కరెక్ట్ గా ఉంటే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. శాంతి , సంతోషం ఇవన్నీ ఉంటాయని చాలామంది నమ్ముతారు.మరికొంతమంది రాత్రనకా పగలనకా కష్టపడుతూ ఉంటారు. కానీ ఒక్క రూపాయి కూడా మిగలదు. అలాంటివారు కొన్ని వాస్తు నియమాలను ప్రతిరోజు కచ్చితంగా పాటిస్తే ప్రయోజనం కలుగుతుంది. ఒకవేళ ఇవన్నీ పాటిస్తే ధనవంతులు కూడా అయ్యే అవకాశం ఉంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సాయంత్రం పూట ఎంత దగ్గర వారైనా సరే పెరుగు, పాలు , నూనె, ఉప్పు ఇలాంటి వస్తువులను ఇవ్వకూడదు. ఒకవేళ ఇలాంటివి ఇస్తే.. వాస్తు శాస్త్ర ప్రకారం ఆ ఇంట్లో నివసించే వారి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది.
ఇంకా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు అనేక ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు భోజనం కింద కూర్చొని తినేవారు. ఇప్పుడు మంచం మీద కూర్చొని తింటున్నారు. అదేనండి అప్పటి వారికి ఇప్పటి వారికి తేడా.. అందుకే అప్పట్లో ఆరోగ్య సమస్యలు కానీ డబ్బు సమస్యలు కానీ ఉండేవి కావు .m ఇప్పుడు ప్రతిదీ సమస్య అందుకని కింద కూర్చొని తినడం అలాగే కొన్ని కొన్ని వాస్తు పద్ధతులను పాటిస్తే.. అదృష్టం డబ్బు మన వెంటే ఉంటుంది.
మరికొందరు ఇంటి ద్వారం వద్ద చెత్తకుండీని పెట్టి అదృష్టాన్ని దూరం చేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పటికీ చెత్త కుండీలు బయటే పెట్టాలి. ఇలా కొన్ని నియమాలను పాటిస్తే బీదవాడు కూడా అదృష్టవంతుడు కాగలడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?