మానవుడి జీవితంలో అనేక ఆటుపోటులు. అయితే వాటిని దాటడానికి కేవలం మానవ ప్రయత్నం సరిపోదు. దీనికి కొంత పౌరుష ప్రయత్నం అంటే దైవ సంకల్పం, అనుగ్రహం కావాలి. దీనికోసం అందరూ ఏదో ఒకదేవుడిని తమకు ఇష్టమైన లేదా వంశపారంపర్యంగా వస్తున్న దేవతామూర్తులను ఆరాధించాలి. అలా ఏవి తెలియనివారు పంచాక్షరి, అష్టాక్షరి లేదా రామతారకం వంటివి నిత్యం పారాయణం చేస్తే తప్పక వారికి భగవదనుగ్రహం కలుగుతుంది. దీనికోసం పెద్దలు చెప్పిన పరిహారాలలో నారాయణాష్టాక్షరి ఒకటి.
శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి
‘‘ ఓం ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర
వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః || ౧ ||
న నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే
దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః || ౨ ||
మో మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్
మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః || ౩ ||
నా నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే
నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః || ౪ ||
రా రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్
కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః || ౫ ||
య యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ
యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః || ౬ ||
ణా ణాకారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్
నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః || ౭ ||
య యజ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయతే నమః
సుజ్ఞానగోచరాయాఽస్తు యకారాయ నమో నమః || ౮ ||
ఈ అష్టాక్షరి శ్లోకాలను నిత్యం ఎవరైతే చదువుతారో వారికి నారాయణుడి అనుగ్రహం లభిస్తుంది. వారి స్థితిలో అనుకూల మారుపలు వచ్చి ఉన్నతస్థితికి చేరకుంటారు.