కర్మసిద్ధాంతం నమ్మే అందరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నవగ్రహారాధన తప్పక చేస్తారు. అదేవిధంగా ఆయా దేవాలయాల సందర్శన, ప్రదక్షణలు చేస్తే స్నానం చేయాలా కాళ్లు కడుగుకోవాలా అనే విషయాలు రకరకాలుగా చెప్తారు.
అసలు ఏం చేయాలో తెలుసుకుందాం… నవగ్రహ దర్శనం తర్వాత కాళ్లు కడుక్కోవాలా? వద్దా? కడుక్కుంటే ఎందుకు కడుక్కోవాలి? అయితే.. నవగ్రహాల పూజ తర్వాత కాళ్లు కడుక్కోవాలనేది ఏ శాస్త్రం లోనూ లేదు. ఏ ధర్మంలోనూ చెప్పలేదు. నవగ్రహాల పూజ చేసి… అక్కడే కాళ్లు కడుక్కుంటే దోషాలన్నీ పోతాయని చాలామంది చెబుతుంటారు. కానీ.. ఇవన్నీ నిజాలు కాదు. ఎందుకంటే.. ఏ గుడికి వెళ్లేటప్పుడు కానీ.. ముందే కాళ్లు కడుక్కుంటాం. తర్వాత కడుక్కోం. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే స్నానం చేసి.. మంచి వస్త్రాలను ధరించి… గుడికి వెళ్తాం.
నవగ్రహాలక బయట నుంచి తగలకుండా ప్రదక్షణలు చేస్తే ఎటువంటి కాళ్లు కడుగుకోవడం అవసరం లేదు. అయితే శనిత్రయోదశి, ఇతర గ్రహబాధలు పోవడానికి రకరకాల పద్ధతులలో పూజలు చేస్తారు. ఆయా సందర్భాలలో సాన్నం చేయాల్సి ఉంటుంది. అయితే అది అక్కడ పండితుల సలహాల ప్రకారం వారు ఏది చెపితే అది పాటించండి. శనిత్రయోదశికి తైలాభిషేకం, ఉప్పు, నల్ల నువ్వులు ఇతర పదార్థాలతో తీవ్రమైన శనిదోషాలకు చేసిన ప్పుడు ఆయా పద్ధతుల్లో స్నానం చేయడం లేదా వస్త్రాలు మార్చుకోవడం వంటి రకరకాల పద్ధతులను పాటిస్తారు. ఏ విషయమైన తెలిసి తప్పు చేస్తే దోషం. తెలియక చేస్తే పొరపాటు. కాబట్టి వాటి గురించి చింతించక దేవుడిపై భారం వేసి కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఉత్తమం. నిత్యం భగవన్నామ స్మరణ చేసుకోవడం మంచిది.