అక్టోబర్ 17 నుంచి భద్రాచలంలో నవరాత్రులను నిర్వహిస్తున్నట్లు దేవాలయం బోర్డు ప్రకటించింది. ఈ రోజు నుంచి ప్రతీరోజు అమ్మవారిని ఆయా రూపాలలో అలంకరించనున్నారు. ఆ వివరాలు..
అక్టోబర్17న ఆదిలక్ష్మి అలంకారం, 18న సంతానలక్ష్మి, 19న గజలక్ష్మి, 20న ధనలక్ష్మి, 21న ధాన్యలక్ష్మి, 22న విజయలక్ష్మి, 23న ఐశ్వర్యలక్ష్మి, 24న వీరలక్ష్మి, 25న మహాలక్ష్మి, 26న నిజరూపంలో దర్శనం ఉంటుంది. ధనం, ధాన్యం, సంతానం, విద్య, అధికారం, వీరం, విజయం, ఐశ్వర్యం.. ఇలా మనిషికి అవసరమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించడానికి అష్టలక్ష్మి రూపాలను ధరించిన అమ్మ కరుణా స్వరూపమైన తన నిజరూపంలో అందర్నీ అనుగ్రహిస్తుంది. 17 నుంచి 21 వరకు ఐదు రోజుల వరకు శ్రీమణవాళ మహాముని తిరునక్షత్ర ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక సేవా కాలం నిర్వహించి మధుర పదార్థాన్ని నివేదించనున్నారు. నిజ అశ్వయుజ మాసోత్సవాలో భాగంగా 31న పౌర్ణమిని పురస్కరించుకుని శబరి మాత పేరిట యాత్రను నిర్వహించనున్నారు. వచ్చే నెల 14న దీపావళి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.