Sleeping: రాత్రివేళ దాహం వేస్తే మంచినీళ్లు తాగడం కోసం వాటర్ బాటిల్ పెట్టుకొని నిద్రపోవడం మనలో చాలామందికి అలవాటు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రం అలా చేయొద్దని చెబుతున్నారు. వాటర్ బాటిల్ మాత్రమే కాదు. బెడ్ రూమ్ లో మరికొన్ని వస్తువులు నిద్రపోయే ముందు మన పక్కన పెట్టుకోకూడదు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి నిద్రించే సమయంలో మంచం దగ్గర మంచి నీళ్లు పెట్టుకునే అలవాటు అశుభం గా పెద్దలు చెబుతున్నారు. అలా వాటర్ బాటిల్ పెట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అందువల్ల రకరకాల సమస్యలు ఎదుర్కోవచ్చు. అలాగే నిద్రపోయే ముందు పుస్తకం లేదా పేపర్ చదివే అలవాటు ఉంటుంది. చదివితే కానీ కొంతమంది నిద్రపోలేరు. అలా పుస్తకాలు చదివిది దిండు కింద పెట్టుకుంటే అది కూడా నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. లేని కొన్ని సమస్యలు వస్తాయి.
ఇటీవల కాలంలో కొంతమంది పడక గదిలో భోజనం చేసే అలవాటు చేసుకుంటున్నారు. మంచంపైన కూర్చొని తినడమే కాకుండా.. తిన్న వస్తువులు కూడా అక్కడే పెట్టేసి వదిలేస్తున్నారు. వాటిని తియ్యకుండా అలాగే వదిలేస్తున్నారు. అంతేకాదు దాంపత్య జీవితం లో కూడా అడ్డంకులు రావచ్చు.
చాలామంది మహిళలు నిద్రపోయే ముందు వారి మెడలోని నగలు తీసి దిండు కింద పెట్టుకుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందట. నగలు భద్రపరిచిన తర్వాత మాత్రమే నిద్రపోవాలని చెబుతున్నారు. ఒకసారి వేసుకున్న బట్టలు మరోసారి వేసుకున్నాక కొత్త కావడానికి వెయ్యాలని చాలామంది అనుకుంటారు. తరచుగా ఉతకడం వల్ల బట్టలు పాడైపోతాయని ఇలా చేస్తుంటారు. అయితే ఒకసారి వాడిన బట్టలు ఉతకకుండా మంచం మీద వేయకూడదు. కొందరు అలా వేసి వదిలేస్తారు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు చుట్టూ ముట్టవచ్చు. కాబట్టి ఎప్పటికీ బట్టలు ఉతకడం లేదా ఒకసారి వేసుకున్న వాటిని సరైన స్థానంలో పెట్టుకోవడం అవసరం.