Plant: మనదేశంలో ఇప్పటికీ చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా ఇంటిని కూడా వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు. అంతేకాదు వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో కష్టాలు దూరమై వాస్తు దోషాలు, పితృ దోషాలతో పాటు గ్రహాల వల్ల కలిగే దుష్ఫలితాలు కూడా తొలగిపోతాయి. అదే విధంగా ఇంట్లో మొక్కలు నాటడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా సాక్షాత్తు లక్ష్మీదేవి కొన్ని మొక్కలు మరియు చెట్లలో నివసిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు.
ఆ మొక్కలను మీరు రక్షిస్తే ఆ ఇంటి పై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని సమాచారం. ముఖ్యంగా పారిజాత మొక్క అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ మొక్కను పారిజాత మొక్క లేదా హారసింగర మొక్క అని కూడా పిలుస్తారు. ఈ మొక్క యొక్క ప్రత్యేకత.. నాటడానికి సరైన దిశ ఏమిటో ఇప్పుడు చూద్దాం. పారిజాత మొక్క పువ్వులు సువాసనను చుట్టూ రాపిస్తాయి.. ఈ అద్భుతమైన పువ్వులు రాత్రిపూట మాత్రమే విరబూస్తాయి. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించే శక్తి ఈ పారిజాత పుష్పాలకు ఉంది.
మానసిక ప్రశాంతత పొందవచ్చు. ఇక నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇకపోతే ఇంటికి ఉత్తరం లేదా తూర్పు లేదా ఈశాన్య దిశలో పారిజాత మొక్కను నాటడం మంచిది. మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో పారిజాతం మొక్కను కలిగి ఉండడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట.