మనం వస్తుమయ ప్రపంచంలో ఉన్నప్పటికీ వాటి ఆకర్షణలకు లోబడకూడదు. భగవంతుడి మీద మనసుపెట్టి వీలైనంత స్వచ్ఛంగ,ఉండే ప్రయత్నం చేయాలి. దీనికి దీనికి ఉదాహరణగా ‘పడవ నీటిలో ఉండొచ్చుగాని, నీరు పడవలో ఉండకూడదు కదా’ అంటారు శ్రీరామకృష్ణులు. సహజంగా మనం మన శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తాం. అలాకాక ప్రతిరోజూ ఇతరుల మంచి కోసం ప్రార్థన చేయడం ,ఉత్తమ లక్షణమని మహోన్నత స్వభావులంటారు. ధ్యానానికి కూర్చోగానే ‘సర్వప్రాణులకు, నాలుగు దిక్కులకు ప్రేమతో…నిండిన ఆకాంక్షను వెదజల్లాలి’ అంటారు వివేకానందస్వామి.
ఇది మనోనైర్మల్యానికి ప్రతీక…మురికి నీరు మురికిని తొలగించలేదు. నిత్యం అపవిత్ర భావాలతో అలరారే వ్యక్తి , మనో పవిత్రతను ఎన్నటికీ పొందలేడు. నిరంతరం ‘పవిత్రత నా జన్మహక్కు, నా నిజతత్త్వం, నా సహజ ప్రవృత్తి, నేను పరిశుద్ధుణ్ని, ఆనందమయుణ్ని’ అన్న భావపరంపరతో కొనసాగడం- హృదయ స్వచ్ఛతను సూచిస్తుంది. పోను పోను స్వచ్ఛతను సాధిస్తుంది.హృదయ పవిత్రతలో పరిణతి సాధించిన వ్యక్తి అజాత శత్రువు. అడుగు పెట్టిన చోటల్లా గౌరవాభిమానాలు పొందుతాడు.
అతడి సమక్షాన్ని అందరూ కోరుకుంటారు. సామీప్యాన్ని అనుభూతించడానికి ఉవ్విళ్లూరుతారు. పునీత భావనలు కలిగిన మహనీయుల కూడికతో జన సమూహం సత్సంగం స్థాయికి చేరుతుంది. …మనసుకు అంటిన మలినాలు ప్రక్షాళన అయినవారంతా ధవళ వర్ణ తేజస్సుతో వెలుగొందుతారు. సాధన వలన సమకూరు సంపదలు అన్నారు పెద్దలు. అవి మన అనుభవం లోకి రావాలంటే వాటి గురించి తెలుసుకోవాలంటే మొదట సాధన కి అలవాటు పడాలిసాధనచేసి సాదించాలి. అపుడే ఏదైనా సిద్ధిస్తుంది….
వృత్తిలో ఉన్నంత వరకూ చేతిలోని పనిమీద మనస్సు లగ్నమై ఉంటుంది. విరామకాలంలోనే మనస్సు పాపచింతనలపైకిపోయే అవకాశముంది. అందుచేత పాపచింతనల బారినుండి తప్పించుకోవాలంటే, మనం విరామకాలం అంతా భగవచ్చింతనలోగడపటానికి అలవాటు పడాలి. దానికి ఎన్నో మార్గాలు. నామజపమో, సత్సంగమో, సత్కథాశ్రవణమో, పూజాదికాల్లోమగ్నులమై పోవడమో, ఎప్పుడూ భగవచ్చింతనలోనే గడపటానికి ఏదో ఒకమార్గాన్ని అన్వేషించాలి. పాపాచరణ జ్ఞానేంద్రియాలతో కానీ, కర్మేంద్రియాలతో కానీ జరగకుండా జాగ్రత్తపడాలి.