Children : వంశమునకు కీర్తి
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విభూథి మహత్యం గురించి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి వారికీ అభిషేకం చేసిన విభూథి లేదా సుబ్రహ్మణ్య స్తోత్రము నందు ప్రసాదము గా ఇచ్చిన విభూథి కానీ ఇంటికి తెచ్చుకుని మీరు ఏ మూల పెట్టినా సరే, ఆ ఇంటికి సరిహద్దు ఎంత వరకు ఉంటుందో అంత వరకు భూత ప్రేతములు పొరపాటున కూడా రావు. ఆ విభూథి కి అంతటి శక్తి కలిగినదిగా శ్రీ ఆది శంకరాచార్యుల వారు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగంలో తెలియచేసారు. సుబ్రహ్మణ్యుని విభూథి ఇంట్లో ఉంచుకుంటే .. పిల్లలకి అనారోగ్యం కలిగినప్పుడు రక్షణగా ఉంటుంది. పిల్లల నుదిటి పై మూడు విభూది రేఖలు పెట్టడం అనేది అలవాటు చేస్తే, ఆ పిల్లలకి మంచి ఆలోచనలు కలిగి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తులై, వంశమునకు కీర్తి తీసుకు వచ్చే వారుగా ఉంటారు. ఆ విభూథి అంత గొప్పది గా చెప్పబడింది.
Children : అదృష్టం
ఇంట్లో విరిగిపోయిన , పాడైపోయిన , పని చేయని వస్తువులు దురదృస్టాన్ని ఇచ్చే శక్తిని బలంగా ఆకర్షించి, దాన్ని అట్టే నిలిపి పెట్టుకుంటుంది. అలా జరగడం వలన మీరు అనేక విషయాలలో వైఫల్యాలను పొందడం తో పాటు , ఆర్థిక సమస్యలను, అపజయాలను, ఆటంకాలను ఎదురుక్కోవలిసి వస్తుంది. వీటినుండి బయట పడాలి అంటే ఇంట్లో వున్న, విరిగిపోయిన వస్తువులు, దెబ్బతిన్న వాటిని ,చిరిగిపోయిన బట్టలు, పాడైపోయిన వస్తువులు, పని చేయని వాటిని పనికి రాని వాటిని వెంటనే దూరంగా పడేయండి. వాటితో పాటే మీ దురదృష్ట శక్తి దూరంగా పోతుంది. అదృష్టం కలిసి వస్తుంది.
పనులన్నీ సమయానికి
మీరు ఏదైనా పని చేయించుకోవడం కోసం ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నా ,మీ పని దగ్గర ఎప్పుడు ఏదొక ఇబ్బందులు వస్తుంటే, ఆఫీస్ లో అడుగు పెట్టే ముందు” “ఓం వషట్కరాయ నమః” అనే మంత్రాన్ని చదువుకుంటూ లోపలికి వెళ్ళండి. మీరేదుర్కొంటున్న సమస్యలు తొలగి, మీ పనులన్నీ సమయానికి సంతృప్తికరంగా జరుగుతాయి.