పిల్లకు చదువు చాలా ముఖ్యం. ప్రతి తల్లిదండ్రులు కోరకునేది తమ పిల్లలు విద్యలో బాగారాణించాలని. దానికోసం వారు పడే కష్టాలు వర్ణనాతీతం. అయితే విద్య కానీ క్రీడలు కానీ మరేరకమైన దానిలోనైనా రాణించాలంటే కృషితోపాటు దేవుని అనుగ్రహం తప్పనిసరి. దీనికోసం పెద్దలు ఆయా పురాణాలలో చెప్పిన పరిష్కారాలు తెలుసుకుందాం…
చదువుల తల్ల సరస్వతి.. ఈ తల్లి అనుగ్రహం కోసం నిత్యం అమ్మవారి ద్వాదశనామాలను పిల్లలతో స్నానం చేయగానే దేవుడు దగ్గర చదివిస్తే తప్పక అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్లోకం తెలుసుకుందాం..
ప్రథమం భారతీ నామః
ద్వితీయం చ సరస్వతీ
తృతీయం శారదా దేవీ
చతుర్థం హంసవాహినీ
పంచమం జగతీఖ్యాతా
షష్ఠం వాగీశ్వరీ తథా
సప్తమం కుముదినీ ప్రోక్తా
అష్టమం బ్రహ్మచారిణీ
నవమం బుధమాతాచ
దశమం వరదాయినీ
ఏకాదశం చన్ద్రకాన్తిః
ద్వాదశం భువనేశ్వరీ
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
జిహ్వాగ్రే వసతే నిత్యం బ్రహ్మరూపా సరస్వతీ !!
భక్తి, శ్రద్ధలతో అమ్మవారిని పై శ్లోకాలను పారాయణం చేస్తే తప్పక మంచి విద్య, మేధస్సు వస్తుంది.