Devotional : కర్మ ఫలితాలు లేకుండా:
రావిచెట్టు చాలా విశేషాలతో కూడుకున్నది. మనకుండే శాపాలు, దోషాలు,పూర్వ జన్మ కర్మలను ఈ రావిచెట్టు తొలగించగలదు అనడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. శాపాలు, దోషాలు,పూర్వ జన్మ కర్మలు తొలగాలి అంటే మాత్రం రావిచెట్టును పూజించవలిసిందే.
ఇంట్లో రావిచెట్టు ఆకులనువేసి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప,దోష,కర్మ ఫలితాలు లేకుండా రక్షణ కలుగుతుంది.
రావిచెట్టు యొక్క ఆకులను తీసుకొచ్చి..దానిపై ప్రమిదలను పెట్టి అందులో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించిన వారికి అనుకున్న కార్యాలు విజయవంతం గా పూర్తవుతాయి.శాపాలు, దోషాలు,పూర్వ జన్మ కర్మలు ,శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు,రాహు-కేతుదోషాలు,
నవగ్రహ దోషాలు వంటి సమస్త దోషాలు తొలగిపోతాయి.
వారం ఒక్కటే తెలిసినవారు :
పుట్టిన తేదీ ,సమయం తెలియని వారు కేవలం వారం ఒక్కటే తెలిసినవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. సోమవారం నాడు పుట్టినవారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో మూడు ప్రమిదలను ఉంచి దీపం వెలిగించాలి.
మంగళవారం నాడు పుట్టిన వారు రెండు దీపాలు వెలిగించాలి.
బుధవారం రోజు పుట్టిన వారు మూడు దీపాలు వెలిగించాలి.
గురువారం రోజు పుట్టిన వారు ఐదు దీపాలు వెలిగించాలి.
శుక్రవారం నాడు పుట్టిన వారు ఆరు దీపాలు వెలిగించాలి
శనివారం రోజు పుట్టినవారు 9 దీపాలు వెలిగించాలి.
ఆదివారం పుట్టిన జాతకులు 12 రావి ఆకులపై ప్రమిదలను వుంచి దీపాలు వెలిగించాలి.
తమలపాకుపై ప్రమిదను:
దీపం వెలిగించేటప్పుడు రావిచెట్టు యొక్క ఆకు కాడ దేవుని పటాల వైపు,ఆకు చివరి భాగం మనవైపు ఉండే విధంగా దీపాన్ని వెలిగించాలి.
దీపం వెలిగించడం అయిన తర్వాత ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని మనః స్ఫూర్తిగా ప్రార్థించాలి. ఇలా చేయడం వలన దోషాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయి అని ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తున్నారు.ఇంకా శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీ దేవిని అనుగ్రహం పొందాలనుకున్నవారు
తమలపాకుపై ప్రమిదలను పెట్టి దీపం వెలిగించడం చాలా శుభప్రదం అని చెప్పబడింది.ఇంకా తమలపాకుపై ప్రమిదను పెట్టి నేతితో దీపమెలిగించడం వలన ఆర్థిక ఇబ్బందులు వుండవని ఆధ్యాత్మిక పండితులునిపుణులు వివరిస్తున్నారు.