Mahashivaratri : మహా శివరాత్రి విశిష్టత గురించి ఆచరించాల్సిన నియమాలు గురించి తెలుసుకుందాం.
మీ ఆరోగ్యం సహకరిస్తుంది అనుకుంటే :
శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందుగానే తెల్లవారు ఝామున నిద్రలేచి అప్పుడు ఉండే పనులు పూర్తి చేసుకోవాలి.
ఆతరువాత మీకు దగ్గర లో ఉండే ప్రవహించే నదిలో కానీ, చెరువులో కానీ, లేదా నూతి దగ్గర కానీ తలమీద నుండి నీళ్లు పోసుకుంటూ స్నానం పూర్తి చేయాలి. ఇక ఆరోజు మీ ఆరోగ్యం సహకరిస్తుంది అనుకుంటే పళ్ళు పాలు తీసుకుంటూ రోజంతా ఉపవాస దీక్షలో ఉండండి.
రోజంతా యోగదీక్షలో కాలం గడుపుతూ ఈ క్రింది మంత్రాలను పఠిస్తూ జాగారం కూడా చేయాలి.
శివ బీజాక్షరీ మంత్రం అయినటువంటి
1.ఓం నమః శివాయ… మంత్రాన్ని
2.ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ అనే మృత్యుంజయ మంత్రాన్ని
3.రుద్రగాయత్రి మంత్రమైన
ఓం తత్పురుషాయ విద్మహే
మహా దేవాయ ధీమహి
తన్నో రుద్ర ప్రచోదయాత్ ..
అంటూ పై మంత్రాలను మీ శక్తి కొలది పటించుకోండి.
Mahashivaratri : రుద్రాక్ష ధరించేవారు:
చాలా మంది రుద్రాక్షను వేసుకోవాలన్నా కోరిక ఉంటుంది. అలా మొదటి సారి రుద్రాక్ష ధరించేవారు శివరాత్రి రోజు రుద్రాక్ష ధరిస్తే చాలా మంచిది అని చెప్పబడింది.మహాశివరాత్రి పర్వ దినమున ,బిల్వ పత్రాలతో శివుడిని పూజిస్తే మంచిది.
మహాశివరాత్రి రోజు శివలింగానికి పంచామృతాలు అయిన పాలు, తేనె, పెరుగు, నెయ్యి,పంచదార తో శివుడికి అభిషేకం చేస్తే ,శివకృపను పొందగలుగుతారు. మహాశివరాత్రి జాగరణ :ఈ రోజు పాటించవలిసిన నియమాల్లో జాగరణ చేయడం అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగినది. మహాశివరాత్రి రోజు రాత్రి పిల్లలు పెద్దలు అందరు ఎంతో నిష్ఠగా జాగరణ నియమాన్ని పాటించి దేవాదిదేవుడు, ఆదియోగి,జగత్ పితా అయినా ఆ శివపరమాత్ముడి కృప ను పొందుతారు.