తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16, శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేపట్టారు. ఆ తరువాత ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆస్థానం జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్రెడ్డికి అర్చకులు కంకణధారణ చేశారు.