తిరుమలకొండపై కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని సుందరాకాండ పారాయణం చేస్తున్నారు.
ఇప్పటికే నాలుగు విడుతలుగా చేయగా అక్టోబర్ 4 నుంచి ఐదోవిడుత అఖండ పారాయణం చేస్తున్నారు. ఈ కార్యక్రమం తిరుమల నాదనీరాజనం వేదికపై అక్టోబరు 4వ తేదీ ఆదివారం ఐదో విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 15వ సర్గ నుంచి 19వ సర్గ వరకు ఉన్న 174 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు. ఎస్వీబీసీ చానెల్లో ఈ కార్యక్రమం లైవ్ చూడవచ్చు.