zodiac sign : ఏ రాశి వారు ఏం పారాయణం చెయ్యాలి..
అందరు నిత్య పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఎవరి నక్షత్ర, రాశి ప్రభావాన్ని బట్టి వారు ఆయా దేవతలను ప్రార్ధిస్తే, ప్రీతి కలిగేలా అర్చిస్తే
తక్షణ శుభ ఫలితాలు కలుగుతాయి అని అంటారు.
ద్వాదశ రాశుల వారూ ఏ ఏ దేవతా స్తోత్రాలు పారాయణ చేసుకుంటే మంచిది అనే విషయం గురించి తెలుసుకుని … ఆ విధంగా చేసి శుభ ఫలితాలు పొందుదాము.
మేషరాశి వారు :ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలి.
వృషభరాశి వారు:విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణ చేసుకోవాలి.
మిధున రాశి వారు:
లక్ష్మీ స్తోత్రం తో పాటు కనకధారాస్తవం పారాయణ చేసుకోవడం మంచిది.
కర్కాటక రాశి వారు :సుబ్రహ్మణ్య స్తోత్రం,మరియు స్కంద పురాణమ్, దుర్గా స్తోత్ర పారాయణ మంచిది.
సింహ రాశి వారు :
మేధో దక్షిణామూర్తి స్తోత్రం తో పాటు దత్తాత్రేయస్తవం చేసుకోవడం ఉత్తమమం.
కన్య రాశి వారు :
హనుమాన్ చాలీసా, చేయడం తో పాటు శివ స్తోత్రం, కాలభైరవాష్టకం, గోవింద నామ స్మరణ చేసుకోవాలి.
తుల రాశి వారు :
సుందరకాండ, గోవింద నామ స్మరణ తో పాటు కాలభైరవాష్టకం, హనుమాన్ చాలీసా చేయడం మంచిది.
వృశ్చికరాశి వారు :
దత్తాత్రేయ స్తవం చేసుకుంటూ ,వామన స్మృతి, మేధో దక్షిణా మూర్తి స్తోత్రం కూడా చేసుకుంటే బాగుంటుంది.
ధనుస్సు రాశి వారు :
లక్ష్మీ నరసింహ స్తోత్రం, స్కంద పురాణం, తో పాటు సుబ్రహ్మణ్య స్తోత్రం కూడా చేసుకుంటే చక్కని ఫలితం.
మకర రాశి వారు :
సంకట విమోచన గణపతి స్తోత్రం పారాయణ చేయడం తో పాటు లక్ష్మీ స్తోత్రం ,పరాశర స్మృతి కూడా చేసుకోవాలి.
కుంభ రాశి వారు :
విష్ణు సహస్ర నామ స్తోత్రం, అష్టాక్షరీ మంత్రం జపం ఈ రెండు చేసుకోవడం మంచిది .
మీన రాశి వారు :
సౌందర్యలహరి తో పాటు శివనామ స్మరణ కూడా ప్రయాణం చేసుకోవడం మంచిది.