ఆయోధ్య.. నేడు ప్రపంచమంతా మారమోగుతున్న పేరు. వందల ఏండ్ల న్యాయపోరాటం తర్వాత వివాదరహితంగా సుప్రీంకోర్టు అనుమతితో అయోధ్య రామాలయానికి శంకుస్థాన ఆగస్టు 5న జరుగుతుంది. దీనితో ఆయోధ్య నగరం మరోసారి వార్తల్లో ప్రధానంశంగా మారింది. అయితే ఈ నగరం వేల ఏండ్ల నాటి చారిత్రక స్థలం. పవిత్రస్థలం. పురాతన నగరం. ఈ పట్టణ విశేషాలు తెలుసుకుందాం.
అసలు అయోధ్య అంటేనే జయించశక్యం కానిది అని అర్థం.
శ్రీరాముని పూర్వీకుడైన ఆయుథ్ మహారాజు పేరిట ఈ నగరానికి అయోధ్య అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు. మరికొన్ని ఆధారాల ప్రకారం హిందువులకు ధర్మశాస్త్రం అందించిన సూర్యవంశ ఆద్యుడు మనువుచే తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం ఈ నగరం స్థాపించబడినట్లు ఒక కథనం ప్రజల్లో ఉంది. ఇక్ష్వాకులు అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించినట్లు పురాణాలో ఉంది. అలాగే ఈ వంశానికి చెందిన పృధువు అనే రాజు వలన ఈ భూమికి పృధ్వి అనే పేరు వచ్చిందని చెబుతారు. సత్యవాక్పరిపాలనకు ప్రసిద్ధి చెందిన హరిశ్చంద్రుడు సూర్యవంశపు 31వ రాజు. ఆయన తన సత్య వాక్కుతో సూర్య వంశ చక్రవర్తుల ప్రతిష్టను ఇనుమడింపజేశాడు. గంగను భువికి దించిన భగీరధుడు, అయోధ్య రాజ్య విస్తరణ చేసిన రఘు మహారాజుల కీర్తి కూడా ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. రఘుమహారాజు పాలనలో సూర్యవంశాన్ని రఘువంశం అని కూడా పిలిచేవారు. సూర్యవంశపు 63వ రాజు దశరధుని రాజ్యసభగా అయోధ్య పట్టణం ఉండేది. ఆ దశరధుడి పూజల ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు. శ్రీ రాముడు కూడా అయోధ్య రాజధానిగా కొంత కాలం రాజ్య పరిపాలన చేశాడు.
అధర్వణ వేదం ప్రకారం దేవతలచే నిర్మించబడిన ఈ నగరాన్ని భువిపై ఉన్న స్వర్గపురి అని కూడా పిలుస్తారు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ వంటి అనేక పురాణ గ్రంధాల్లో అయోధ్య గొప్పదనం విపులీకరించబడింది. కేవలం శ్రీరాముడు మాత్రమే కాదు బాహుబలి, సుందరి, పాడలిప్తసూరీశ్వరి, హరిచంద్ర, అచలభరత వంటి ఎందరో కారణజన్ములు ఈ నేలపై జన్మించిన వారే. హిందువులకే కాకుండా జైన మతస్థులకు కూడా అయోధ్య ఓ ముఖ్య నగరం. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ జైన మతతీర్ధంకులైన వృషభ, గాంధారాలకు అయోధ్య జన్మస్థలంగా ఉంది. హిందూ, జైన మతాలతో పాటు బౌద్ధ మతానికి కూడా అయోధ్యలో ప్రాముఖ్యత ఉంది. మౌర్య చక్రవర్తుల కాలంలో ఇక్కడ అనేక బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు నిర్మించినట్లు చెబుతారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్ధం నుంచి క్రీస్తు శకం 5వ శతాబ్ధం