హిందు ధర్మంలో బొట్టుకు ఉండే ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కర్మసిద్ధాంతం నమ్మే ప్రతీ ఒక్కరూ బొట్టు పెట్టుకుంటారు. అయితే బొట్టు పెట్టుకుంటే ఏం లాభాలు కలుగుతాయో, మన పెద్దలు చెప్పిన విషయాలు పరిశీలిద్దాం..
‘‘భూవోఘ్రాణ స్వయస్సంధిః ’’ అంటే నాసిక పై భాగం భ్రుకుటి మధ్యభాగం కలుసుకొనే చోట పెట్టుకోవాలి అని అర్థం. ఇక్కడ ఇడ,పింగళ ,సుషుమ్న లేక గంగ ,యమున ,సరస్వతి లేకసూర్య ,చంద్ర ,బ్రహ్మ అని పిలువబడే మూడు ప్రధాననాడులు కలుస్తాయి. దీనినే “త్రివేణి సంగమం “అని అంటారు.ఇది పీయూష గ్రంధికి అనగా ఆజ్ఞాచక్రానికి అనుబంధస్ధానం .
ఇదే జ్ఞానగ్రంధి అనికూడా పిలువబడుతుంది. ఎవరైతే సుషుమ్న నాడికి చురుకుదనం కల్గిస్తారో వారు మేధావులౌతారు. మనం ధరించే బొట్టు ప్రభావం పిట్యుటరీ గ్రంధుల పై ఉంటుంది. ” కేనన్ ” అనే పాశ్చాత్య శాస్ర్తవేత..భ్రుకుటి స్థానాన్ని మానవ ధన (+), మెడ వెనుక భాగాన్ని ఋణ (-) విద్యుత్ కేంద్రాలు అన్నారు . ఇవి రెండు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరణ చేస్తుంటాయి. అందుకే జ్వరం వస్తే వైద్యులు నుదుటి పై చల్లటి గుడ్డ వేయమంటారు. ఇంకా సూర్యుని నుండీ వచ్చే విశేషమైన శుభ ఫలితాలను ఇచ్చే కిరణాలను ఆకర్షించే శక్తి కేవలం..ఎర్రటి కుంకుమకే ఉంది. అందువలన మనం ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
మన మెదడు ఉత్తేజితమౌతూ ఉంటుంది. పైన పేర్కొన్న కీలక సున్నిత నాడులను తీక్షణమైన సూర్యకిరణాల నుండి కాపాడేందుకు కుంకుమ ధరించాలి. సాయంత్రం రాత్రి సమయాల్లో కుంకుమకు బదులుగా విభూతిని ధరిస్తే చల్లగా ఉంటుంది. దృష్టి దోషం తగలకుండా బొట్టు..కాపాడుతుంది.ఇక నేడు చాలామంది పెట్టుకునే స్టికర్ బొట్లతో చర్మరోగాలు కలిగిస్తాయి. వీటిని వాడవద్దు. సహజ పద్ధతిలో తయారుచేసిన కుంకుమ, సింధూరం వంటివి మాత్రమే వాడాలి.