ప్రతిఒక్కరు దైవాన్ని పూజించుకునే సమయంలో నైవేద్యం గా కొన్ని పండ్లను పెడుతారు. వాటితోపాటు కొన్ని పూలను ఇంకా ఇతర సామాగ్రీలను కూడా వుంచుతారు. అయితే ఆయా పండ్లను బట్టి ఆయా ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. నేడు జామపండ్ల నైవేద్యం గురించి తెలుసుకుందాం…
జామపళ్లను నైవేద్యంగా పెడితే.. జీవితంలో రాజగౌరవం తోపాటు మంచి సత్కారాలు పొందుతారు. గణపతికి జామపండును నైవేద్యంగా పెడితే ఆరోగ్యానికి సంబంధిం చిన గ్యాస్ట్రిక్, ఉదర వ్యాధులు దూరం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దేవీ దేవాలయానికి జామకా యను నైవేద్యంగా పెట్టి, వాటిని సుమంగళి స్త్రీలకు పంచితే చక్కర వ్యాధి తగ్గిపోతుంది. పెళ్లికాని అమ్మాయిల చేతుల మీదుగా జామపండులతో పూజ చేయించి, సుమంగు ళులకు తాంబూలాలు ఇస్తే.. మంచి వరుడు లభిస్తాడు.
దుర్గాదేవీకి దీపనమస్కారాలు చేసే సమయంలో జామ పళ్లను నైవేద్యం చేసి, సంతానం లేనివారికి ఇస్తే.. సంవత్సరంలోపు వారికి పిల్లలు పుడతారు.
సంకష్ట హర గణపతికి జామపళ్లను నైవేద్యంగా పెట్టి, బ్రాహ్మణులకు తాంబూలంతో కలిపి ఇస్తే.. దేహంలో వుండే నీరసం తగ్గిపోయి ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా వుంటారు. రుద్రాభిషేకం సమయంలో జామపండు రసాలతో దేవునికి అభిషేకం చేసి, ఇతరులకు జామపళ్లను దానం చేస్తే.. నిదానంగా జరిగే పనులు త్వరితంగా పూర్వవుతాయి. ఇవన్ని అనుభవంలో పెద్దలు చెప్పిన విషయాలు, నమ్మకం, శ్రద్ధతో ఆచరిస్తే ఆయా ఫలితాలు తప్పక కలుగుతాయి. భక్తి, శ్రద్ధలతో పైన చెప్పిన పరిహారాలు ఆచిరించి శుభఫలితాలు పొందండి.