సనాతన ధర్మంలో అనేక రహస్యాలు. ప్రతిరోజు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటానికి అనేక మార్గాలను చూపించారు. వాటిలో ప్రధానంగా మనస్సును అదుపులో పెట్టుకోని ఇంద్రియ నిగ్రహంతో జీవిస్తే ఆనందం, దీర్ఘాయుష్షు లభిస్తాయి. వీటికోసం నిత్యం పఠించాల్సిన శ్లోకాలను తెలుసుకుందాం…
ఉదయం నిద్ర లేచిన తరువాత….
“కాశ్యాం దక్షిణ దిగ్భాగే కుక్కుటో నామ వై ద్విజ
తస్య స్మరణ మాత్రేణ దుస్స్వప్న శ్శుభదో భవేత్”
ఉదయం భూప్రార్ధన…
“సముద్రమేఖలే దేవి పర్వతస్తన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే”
మానసిక శుద్ది..
“అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
య:స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచి:”
ఉదయం కరదర్శనం..
“కరాగ్రే వసతే లక్ష్మీ: కరమద్యే సరస్వతి
కరమూలేతు గోవింద: ప్రభాతే కరదర్శనం”
స్నాన సమయంలో…
“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు”
భోజనానికి ముందు….
“అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ణాన వైరాగ్య సిద్ద్యర్దం భిక్షాందేగి కృపాకరి
అన్నం బ్రహ్మారసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరః
ఇతి స్మ్రరన్ ప్రభుంజాన: దృష్టిదోషై: నలిప్యతే”
భోజన తరువాత…
అగస్త్యం కుంభకర్ణంచ శమించ బడభానలనం
అహారపరిమాణార్దం స్మరమిచ వృకోదరం.
ఇలా అనేక శ్లోకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రస్తుతం తెలుసుకున్నాం.