Parama mangala dravam: కస్తూరి మృగాలు
జాతకం లో శుక్రగ్రహ దోషం ఉన్న వారు పూజా మందిరంలో కస్తూరి ఉంచి పూజించాలి.
ఎర్రటి జాకెట్టు ముక్కలు లో దీన్ని ఉంచి బీరువాలోగాని,లాకర్లో గాని పెట్టుకోవడన వలన డబ్బు వృధాగా ఖర్చు కాకుండా నిలిచి ఉంటుంది. మణిద్వీప వర్ణన లో కూడా కస్తూరి మృగాలు సంచరిస్తూ నిత్యం పరిమళాలను వెదచల్లుతూ ఉంటాయి అని వర్ణించబడింది. అంతటి శక్తివంతమైనది ఈ కస్తూరి. కస్తూరి అనేదిబాగా ఖరీదయిన జంతు ఉత్పత్తులలో ఒకటి అని చెప్పవచ్చు.
కస్తూరి ఉన్న ఇంట్లో ధనాభివృద్ధి జరుగుతుంది. రుణభాదలు, అధికారుల వేదింపులు అనేవి ఉండవు.
Parama mangala dravam: రుద్రాక్ష జపమాలేనని
దాంపత్య జీవితంలో కలిగే ఇబ్బందులను తగ్గించి దంపతుల మద్య అన్యోన్యత పెరిగేలా చేస్తుంది.
వ్యాపారాల దగ్గర ఉండే బీరవాలోగాని,గల్లా పెట్టెలోగాని దీన్ని పెట్టుకుంటే, ధనానికి లోటు అనేది ఉండదు.పూజా స్థలంలో పెట్టుకున్న కూడా వ్యాపారాభివృద్ధి జరుగుతుంది.జపం చేసుకునే వారు ఆ సమయం లో చేతిలో మాలను పట్టుకుని తిప్పుతుంటారు. తులసి పూసలతోనూ, స్ఫటికాలతోనూ,రుద్రాక్షలతో ను చేసిన మాలలను పట్టుకుని జపంచేస్తుంటారు. చాలా మంది రుద్రాక్ష మాలలను ధరించడం తో పాటు జపం చేస్తూ ఉండటం కూడా కనిపిస్తూ ఉంటుంది. అన్నిటికంటే శ్రేష్టమైనది రుద్రాక్ష జపమాలేనని దేవీభాగవతం లో పదకొండో స్కందం తెలియచేస్తుంది. రుద్రాక్షలతో జపమాలను ఎలా తయారు చేసుకోవాలి, జపానికి ముందు ఆ మాలను ఎలా శుభ్రంచేసుకోవాలి అనే విషయాలు దేవీభాగవతంలో వివరం గా తెలియచేయబడింది.
రుద్రాక్షలను మాల
ప్రతి రుద్రాక్షలోనూ ఉండే ముఖభాగం బ్రహ్మదేవుడు. ముళ్ళు ఉన్న భాగం రుద్రుడు , పృచ్ఛ భాగం శ్రీమహావిష్ణువు స్థానాలని పెద్దలు చెప్పడం జరిగింది. పంచముఖి రుద్రాక్షలు ఇరవై అయిదు వరకు తీసుకుని జపమాల చేసుకోవడం అనేది చాలా మంచిది అని అంటారు. ఈ రుద్రాక్షలు కంటకాలతో గరుకుగా ఎరుపు రంగులో లేదా తెలుపు రంగులో కానీ ఆ రెండూ కలసిన ఉన్న మిశ్రమ వర్ణంలోకానీఉండాలి. ముఖభాగం ముఖ భాగంతోనూ, పృచ్ఛభాగం పృచ్ఛభాగంతోనూ కలిసేలా రుద్రాక్షలను మాలగా తయారు చేసుకోవాలి. దీనికి బ్రహ్మముడి ఉండాలి. ఇలాంటి రుద్రాక్షమాలను నాగపాశం అనిఅంటారు.